ETV Bharat / state

ల్యాండ్ టైటిలింగ్ చట్టం- భూ కబ్జాదారుల చుట్టమా? - Lawyers on Land Titling Act

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 6:53 PM IST

land titling act
land titling act(ఈటీవీ భారత్ ప్రత్యేకం)

Interview with Lawyers on Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా ఉందని న్యాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు అండగా ఉన్న సివిల్ కోర్టులను నిర్వీర్యం చేస్తూ ప్రజల ఆస్తులను బలవంతులు కాజేసేందుకు కుట్రలు పన్నారని మండిపడుతున్నారు. ప్రజల ఆస్తులను కొట్టేసి భూ దందాలు చేసే వారికి అనుకూలంగా చట్టాన్ని రూపొందించారని ఆరోపిస్తున్నారు.

Interview with Lawyers on Land Titling Act: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూహక్కు చట్టంపై న్యాయ నిపుణులు నిప్పులు చెరుగుతున్నారు. పేదలకు అండగా ఉన్న సివిల్ కోర్టులను నిర్వీర్యం చేస్తూ, ప్రజల ఆస్తులను బలవంతులు కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిస్థాయిలలో ఉన్న న్యాయవాదులు ఎనిమిది నెలలపాటు ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రజా చట్టలు చేస్తున్నపుడు అన్ని అంశాలను పరిశీలించాల్సిన ప్రభుత్వం భూ దందాలు చేసే వారికి అనుకూలంగా పేద, అమాయక ప్రజల ఆస్తులను లాక్కునేలా చట్టాన్ని రూపొందించారని అన్నారు. ఈ చట్టాన్ని తక్షణమే నిలుపుదల చేయకపోతే చిన్నపాటి గూడు కట్టుకున్న వాడికి కూడా ఆస్తికి రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు అంటున్నారు.

ల్యాండ్ టైటిలింగ్ చట్టం- భూ కబ్జాదారుల చుట్టమా? (land titling act 2023(ఈటీవీ భారత్))

భూహక్కు చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం - వెంటనే రద్దు చేయాలంటూ న్యాయవాదుల నిరసనలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2019 భూ పత్రాలు, దస్త్రాల ట్యాంపరింగ్ జరగకుండా ఈ చట్టం తోడ్పడుతుందని అధికారులు చెప్తున్నారు. భూమి ఉన్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం, రికార్డుల్లో లోపాల కారణంగా చాలామంది యజమానులు పూర్తి స్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారు. ఫలితంగా భూ వివాదాలు ఏర్పడితే సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఈ చట్టం వల్ల ఆ సమస్యలు తొలగిపోతాయని అధికారులు చెప్తున్నారు. భూ రికార్డులు సరిగా లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ది పొందేందుకూ ఇబ్బంది పడుతున్నారని దీని వల్ల ఊరట పొందొచ్చని ప్రభుత్వ ప్రజల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది.

భూయజమానుల హక్కుల్ని హరించేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ - రాష్ట్రంలో దుమారం - Land Titling Act in Andhra Pradesh

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం (యాక్ట్‌ 27/2023) విషయంలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం విషయంలో పలు కీలక తీర్మానాలు చేసింది. ప్రజా ప్రయోజనానికి, ముఖ్యంగా పేదలు, ఆర్థికంగా బలహీనవర్గాల వారికి విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేయాలని తీర్మానం చేసింది. అంతేకాక ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ ఏపీ బార్‌ కౌన్సిల్‌ తరఫున హైకోర్టులో వ్యాజ్యం వేయాలని తీర్మానించింది.

భూ హక్కులకు మడతపెట్టేందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ 2022!

భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాదులు సైతం డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం భూ యాజమాన్య హక్కులను కాలరాస్తోందని వెంటనే జీవో 512ను రద్దు చేయాలంటూ ఆందోళను చేపడుతున్నారు. ప్రజల హక్కులను హరించే విధంగా జీవో ఉందని, ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చెందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.