గంజాయి సేవిస్తున్నారా? ఐతే జాగ్రత్త బ్రదర్ - ఇక నుంచి పోలీసులు ఈజీగా పట్టేస్తారు!! - DRUGS AND DRIVE TEST

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 10:03 AM IST

Drug and Drive Test for Drug Control in Telangana

Drugs and Drive Test in Telangana : రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల ఊబి నుంచి రక్షించేందుకు పోలీసులు ఒక వినూత్న కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. డ్రగ్స్​ను సేవించే వారిని గుర్తించేందుకు ఇకపై నుంచి డ్రగ్స్​ అండ్​ డ్రైవ్​ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో పాజిటివ్​ అని తేలితే మాత్రం అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలకు పోలీసులు పూనుకోనున్నారు.

Drugs and Drive Test in Telangana : మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసులు ఎక్కడికక్కడ కళ్లెం వేస్తున్నా రాష్ట్రంలో అవి చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి. మొన్నటి దాకా వాటి సరఫరాపై నిఘా పెట్టిన అధికారులు ఇప్పుడు దాంతోపాటు వినియోగంపైనా దృష్టి సారించనున్నారు. డ్రగ్స్​ను సేవించే వారిని పట్టుకుంటే వినియోగాన్ని కాస్తయినా నియంత్రించవచ్చని భావిస్తున్న పోలీసులు ఓ వినూత్న కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు ఉపయోగించే డ్రంకెన్​ డ్రైవ్​ పరీక్షలు(Drunk and Drive Test) మాదిరిగా, ఒక కిట్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇదే డ్రగ్స్​ అండ్​ డ్రైవ్​ పరీక్షల కిట్. దీనిని రాష్ట్ర పోలీస్​ శాఖ తెరపైకి తీసుకువచ్చింది. డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షల ద్వారా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని, ప్రధానంగా గంజాయిని సేవించే వారిని గుర్తించవచ్చు.

దీని కోసం 'ఎబోన్​ యూరిన్​ కప్'(Ebon Urine Cup)​ యంత్రంతో పరీక్షలు జరపాలని పోలీసులు తెలిపారు. ఈ కిట్​ను తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్​ బ్యూరో(టీఎస్​న్యాబ్​) సమకూర్చింది. ఆ కిట్​లను రాష్ట్రంలోని అన్ని పోలీస్​ స్టేషన్లకు పంపించింది. ఈ యంత్రం సాయంతో ఏ విధంగా గంజాయి తాగే వారిని గుర్తించవచ్చో సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. కానీ ఇప్పటికే కొన్ని ఠాణాల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది తనిఖీలను మొదలు పెట్టారు.

Drug and Drive
ఎబోన్​ యూరిన్​ కప్

బాలికలకు డ్రగ్స్​ అలవాటు చేసి రేవ్​ పార్టీల్లో వ్యభిచారం! - జగిత్యాల జిల్లాలో గంజాయి ముఠా అరాచకాలు

Drugs Control in Telangana : ఈ మేరకు డోర్నకల్​ సీఐ ఉపేంద్ర రావు, ఎస్సై సంతోష్​రావులు సోమవారం డోర్నకల్​లో డ్రగ్స్​ అండ్​ డ్రైవ్(Drugs and Drive Test)​ పరీక్షలు నిర్వహించారు. గార్ల ఎస్సై జీనత్​కుమార్​ రైల్వే స్టేషన్​, బస్టాండ్​ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా కనిపించే, తిరుగుతున్న యువకులకు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్ష నిర్వహించిన అనంతరం అందులో పాజిటివ్​ వస్తే మాత్రం అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే అనుమానం వచ్చిన పక్షంలో కిట్​ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహిస్తున్నామని డోర్నకల్​ సీఐ ఉపేంద్రరావు తెలిపారు. ఈ పరికరం ద్వారా పరీక్ష చేసినప్పుడు రెండు ఎర్ర గీతలు వస్తే నెగెటివ్​గా, ఒకటే గీత కనిపిస్తే పాజిటివ్​గా పరిగణిస్తామని పేర్కొన్నారు. పాజిటివ్​ వస్తే మాత్రం అదుపులోకి తీసుకొని అవసరమైతే తదుపరి పరీక్షలు కూడా నిర్వహిస్తామని సీఐ ఉపేంద్రరావు తెలిపారు.

డ్రగ్స్​ తీసుకున్నారో దొరికిపోతారు - 2 నిమిషాల్లో మిమ్మల్ని ఇలా పట్టేస్తారు​

గోవా నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్ - పక్కా సమాచారంతో అరెస్టు చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.