ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్ఎస్‌ బృందం - పియర్స్‌ దెబ్బతిన్న చోట తీసుకుంటున్న చర్యలపై ఆరా - CWPRS Experts Visit Medigadda Today

author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 8:12 PM IST

Updated : May 22, 2024, 10:01 PM IST

CWPRS team inspected Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్‌ స్టేషన్ నిపుణులు ఇవాళ పరిశీలించారు. మేడిగడ్డపై కాలినడకన తిరుగుతూ అణువణువు నిపుణుల బృందం పరిశీలించింది. ప్రధానంగా 7వ బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్స్‌ను నిశితంగా తనిఖీ చేశారు. కుంగుబాటు కారణాలపై ఇంజినీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్న బృందం, దెబ్బతిన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.

Medigadda Repair Works Updates
CWPRS Experts Team Visit to Medigadda (ETV Bharat)

CWPRS Expert Team Visits Medigadda Barrage Today : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. సీడబ్ల్యూపీఆర్ఎస్‌ పూణేకు చెందిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ జె.ఎస్ ఎడ్లబడ్కర్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ డాక్టర్ ధనుంజయ్ నాయుడు, నాన్ డిస్ట్రిక్టీవ్ పరీక్ష ఎక్స్‌పెర్ట్‌ డాక్టర్ ప్రకాశ్‌ పాలేకు బృందం అణువుణువునా పరిశీలిన చేసింది.

మేడిగడ్డపై కాలినడకన తిరుగుతూ అనువణువు పరిశీలించిన నిపుణుల బృందం : ఈ బృందం పూణే నుంచి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. ఎల్అండ్ అతిధి గృహంలో భోజనం చేసి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకొని కుంగి, దెబ్బతిన్న ప్రదేశంలో చూశారు. ఏడో బ్లాక్ ప్రాంతంలో బ్యారేజీ వంతెన పై కాలినడకన సాగుతూ పరిశీలించారు. బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతల్లో తిరుగుతూ అణువుణువునా పరీక్షించారు.

బ్యారేజీ దిగువకు చేరుకొని ఏడో బ్లాక్ ప్రాంతంలో 20పియర్ పగుళ్లు, దెబ్బతిన్న గేటును చూసి, మిగతా గేట్లు, పియర్ల పరిస్థితులను పరిశీలన చేశారు. పియర్లలో పగుళ్లులలో ఎంత మేర కొలతలలో తేడా ఉందో అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ 7లో ఎనిమిది గేట్లు, పియర్, డబుల్ పియర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్‌లు ఏ విధంగా కొట్టుకపోయాయో అడిగారు. మేడిగడ్డ బ్యారేజీలో ఇప్పటివరకు ఎలాంటి పరీక్షలు చేశారో అడగగా ఈఆర్టీ, జీపీఆర్టీ పరీక్షలు చేసినట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.

Medigadda Barrage Temporary Repairs : బ్యారేజీలో ఎలాంటి పరీక్షలు చేయాలో తెలియజేస్తామని, నాలుగు లేదా వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. బ్యారేజీలలో పరీక్షల నిర్వహణకు ఎలాంటి సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయో చెప్పాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ ఏ విధంగా దెబ్బతిందో, ప్రస్తుత పరిస్థితులు, చేస్తున్న పనుల వివరాలను సీఈ సుధాకర్ వివరించారు. మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీకి చేరుకొని అప్, డౌన్ స్ట్రీమ్‌లను చూశారు.

28, 35, 38, 44 గేట్ల వద్ద లీకేజీ, సీపేజీలు, చేసిన మరమ్మతులను పరిశీలించారు. బ్యారేజీకి ఎగువన పియర్స్ వద్ద ఇసుక పేరుకపోయి మరమ్మతులకు అడ్డుగా ఉండడంతో ఇసుక తొలగింపు ప్రక్రియ ఎంత మేర జరిగిందో వారికి ఈఈ యాదగిరి వివరించారు. ఈ బృందం బుధవారం రాత్రి కాళేశ్వరంలో బస చేసి గురువారం పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీని పరిశీలనకు వెళ్లనున్నారు. కార్యక్రమంలో రామగుండం సర్కిల్ సీఈ సుధాకర్ రెడ్డి, ఎస్ఈ కరుణకర్, ఈఈ తిరుపతి, యాదగిరి, డీఈ సురేశ్‌ పాల్గొన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ అప్డేట్ - ఏడో బ్లాక్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీడబ్ల్యూపీఆర్ఎస్‌ బృందం - Medigadda Barrage Temporary Repairs

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు తాత్కాలిక చర్యలు, తదుపరి పరీక్షల అధ్యయనానికి కమిటీ - Kaleshwaram Project News Latest

Last Updated : May 22, 2024, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.