ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ అప్డేట్ - ఏడో బ్లాక్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీడబ్ల్యూపీఆర్ఎస్‌ బృందం - Medigadda Barrage Temporary Repairs

author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 2:40 PM IST

Medigadda Repair Works Updates : మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలో భాగంగా మరిన్ని పనులపై అధికారులు ఫోకస్‌ పెట్టారు. ఇందులో భాగంగా దెబ్బతిన్న, కుంగిన ఏడో బ్లాక్‌లో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 15వ గేట్‌ను ఎత్తగా, 16వ గేట్ ఎత్తడంపై అధికారులు దృష్టి సారించారు.

Medigadda Barrage Temporary Repairs 2024
Medigadda Barrage Temporary Repairs 2024

Medigadda Barrage Temporary Repairs 2024 : మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమవ్వగా, మరిన్ని పనులు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దెబ్బతిన్న, కుంగిన ఏడో బ్లాక్‌లో మొత్తంగా 11 గేట్లు ఉండగా, ఇందులో ఎనిమిది గేట్లు మూసి ఉన్నాయి. ఆనకట్ట పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఆ బ్లాక్‌లోని 15వ గేట్‌ను శుక్రవారం ఎత్తగా, మిగిలిన ఏడు గేట్లను ఎత్తడానికి పనులు చేస్తున్నారు.

Medigadda Damage Updates : వరద ప్రవాహానికి గేట్ల మధ్యలో ఇరుక్కున చెత్త చెదారం, మట్టిని కూలీలతో తీయిస్తున్నారు. ఆ బ్లాక్ ప్రాంతంలో స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. 16వ గేట్‌ను ఎత్తితే ఏర్పడే ఇబ్బంది, సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తుండగా, గురువారానికి ఎత్తే అవకాశం ఉంది. వరద ప్రవాహానికి కొట్టుకపోయి, చెల్లాచెదురుగా ఉన్న సీసీ బ్లాక్ అమరిక, స్యాండ్ గ్రౌటింగ్ పనులు సాగుతున్నాయి. వర్షాకాలంలో వరదను తట్టుకునేలా ఏడో బ్లాక్ ప్రాంతంలో షీట్ ఫైల్స్‌ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

CWPRS Experts Visit Medigadda Today : మరోవైపు కాళేశ్వరంపై నిపుణుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు (సీడబ్ల్యూపీఆర్ఎస్‌) నిపుణులు బ్యారేజీలను సందర్శించారు. సమగ్ర పరీక్షల తర్వాత ఎన్‌డీఎస్ఏ కమిటీ సూచనల మేరకే మేడిగడ్డ సహా మిగిలిన ఆనకట్టల మరమ్మతుల విషయంలో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.

బ్యారేజీల వద్ద పరీక్షలు కూడా స్థానిక సంస్థలు కాకుండా ఎన్‌డీఎస్ఏ కమిటీ సూచించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలచేత చేయించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఆనకట్టల పరీక్షల కోసం దిల్లీలోని సీఎస్ఎమ్ఆర్ఎస్‌, పూణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్‌, హైదరాబాద్‌లోని ఎన్‌జీఐఆర్ఐ సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ సర్కార్‌కు తెలిపింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఆయా సంస్థలను ఇప్పటికే సంప్రదించింది.

ఎన్‌డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షలు నిర్వహించాలని, ఇందులో భాగంగా మొదట బ్యారేజీలను పరిశీలించాలని కోరింది. ఈ మేరకు సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ( సీడబ్ల్యూపీఆర్ఎస్‌) నిపుణుల బృందం ఇవాళ మూడు ఆనకట్టలను పరిశీలించనుంది. ఇందులో భాగంగా తాజాగా మేడిగడ్డకు చేరుకున్న బృందం బ్యారేజ్‌లో దెబ్బతిన్న, కుంగిన ఏడో బ్లాక్ ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. ఎన్‌జీఆర్ఐ ప్రతినిధులు కూడా ఒకట్రెండు రోజుల్లో పరిశీలన చేసే అవకాశం ఉంది. మూడు సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో చర్చించిన తర్వాత, ఎవరితో ఏ పరీక్షలు చేయించాలన్న విషయమై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

వీలైనంత త్వరగా పరీక్షలు ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉండగా, ఎన్‌డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన పరీక్షల్లో, కొన్ని వర్షాకాలం కంటే ముందే పూర్తి చేయాలి భావిస్తోంది. వర్షాలు పడి ఒకసారి బ్యారేజీల్లోకి నీటి ప్రవాహాలు ప్రారంభమైతే ఆ పరీక్షలకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున, త్వరితగతిన పరీక్షలు ప్రారంభించాలని సర్కార్‌ భావిస్తోంది.

మేడిగడ్డలో తాత్కాలిక పనులు - మరమ్మతులు చేసినా ఉంటుందనే గ్యారంటీ లేదన్న ఎన్డీఎస్​ఏ కమిటీ - TS CABINET ON MEDIGADDA REPAIR

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు తాత్కాలిక చర్యలు, తదుపరి పరీక్షల అధ్యయనానికి కమిటీ - Kaleshwaram Project News Latest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.