ETV Bharat / state

కేంద్రంలో కాంగ్రెస్​ గెలిచే పరిస్థితే లేదు : హరీశ్​రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 3:36 PM IST

BRS Harish Rao on Lok Sabha Elections
BRS MLA Harish Rao Fires On CM Revanth Reddy

BRS MLA Harish Rao Fires On CM Revanth Reddy : తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం సీఎంగా ఉన్నారని బీఆర్​ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాదన్నారు. షాద్​నగర్​ బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్​పై ఫైర్​ అయ్యారు.

BRS MLA Harish Rao Fires On CM Revanth Reddy : తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం సీఎంగా ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాగే లోక్​సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.

'షాద్​నగర్​లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయాం. కనీసం ఇక్కడ మనకు ఎంపీ అయినా ఉండాలి. మనకి ఏదైనా సమస్యవస్తే ఎంపీ వచ్చి మనకు తోడుగా ఉంటాడు. అందుకు అందరూ కష్టపడాలి. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్​నగర్​లో గులాబీ జెండా ఎగురవేయాల్సిందే దానికి అందరు కార్యకర్తలు సిద్ధం అవ్వండి.' అని హరీశ్​రావు అన్నారు.

'ఇచ్చిన గ్యారంటీలకు, బడ్జెట్‌ కేటాయింపులకు పొంతనే లేదు - బీజేపీ మౌనం వెనక మర్మమేంటి?'

తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం షాద్​నగర్​ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర పోరాట సమయంలో షాద్​నగర్​ ప్రజలు ఉద్యమంలో స్ఫూర్తిని నింపారని హరీశ్​రావు గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్​ను వదిలిపెట్టమని అన్నారు. కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే ఫోన్​ చేయాలని వారందరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్​ (KCR) ఒక్కడిగా బయలుదేరి దిల్లీని కదిలించి తెలంగాణను సాధించారని తెలిపారు.

" కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్​ సాగర్ ఈ నాలుగు ప్రాజెక్టుల్లో 30 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్​నగర్​లో కాంగ్రెస్​ 27,300 ఎకరాలకు నీరు ఇచ్చింది. బీఆర్​ఎస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,36,000 ఎకరాలకు నీరు అందించాం. కల్వకుర్తి పంపుహౌస్​లో పడుకుని వారితో పనులు చేయించాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. మహబూబ్ ​నగర్​, నాగర్ ​కర్నూల్​, వనపర్తి, గద్వలా నారాయణ్​ పేట్​లో మెడికల్​ కాలేజీలు వచ్చినాయంటే బీఆర్​ఎస్ వచ్చాకనే వచ్చాయి." - హరీశ్​రావు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేక గారడీలు చేస్తున్నారు - కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్‌

BRS Harish Rao on Lok Sabha Elections : కేంద్రంలో కాంగ్రెస్ (Congress) గెలిచే పరిస్థితి లేదన్నారు. పశ్చిమ బంగాల్​ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్​కు 40 సీట్లు రావని అన్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి రాని కాంగ్రెస్​కు ఓటు వేస్తే ఎలాంటి ఉపయోగం లేదన్నారు. గల్లీలో ఎవరున్నా, దిల్లీలో ఎవరున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది బీఆర్​ఎస్​ ఎంపీలని చెప్పారు. కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే బీఆర్​ఎస్​ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాలని కోరారు.

కేంద్రంలో కాంగ్రెస్​ గెలిచే పరిస్థితే లేదు హరీశ్​రావు

రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే అడుక్కోవాల్సి వస్తుంది - హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.