ETV Bharat / state

కృష్ణా నదిలో అక్రమ తవ్వకాలు - అడ్డుకోవాలని కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 9:24 AM IST

AP High Court Orders on Illegal Mining: నదుల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి ఈ నెల 14 నాటికి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఎన్జీటీ ఆదేశించింది. కానీ కలెక్టర్లు మాత్రం తూతూమంత్రంగా పని కానిచ్చేశారు. ఈ తరుణంలో కృష్ణా నదిలో అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశించింది.

High_Court_Orders_on_Illegal_Mining
High_Court_Orders_on_Illegal_Mining

AP High Court Orders on Illegal Mining : కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడికుదురు, నిమ్మగడ్డ గ్రామాల పరిధిలోని కృష్ణా నదిలో ఇసుక, బుసక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశించింది. తవ్వకాలను నిలువరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ స్థాయి నివేదిక ఇవ్వాలని తేల్చి చెప్పింది. ప్రతివాదులను నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాగుర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

Illegal Mining at Krishna River : కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నిబంధనలకు విరుద్ధంగా నడికుదురు, నిమ్మగడ్డ గ్రామాల పరిధిలోని కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ సామాజిక కార్యకర్త తాతానేని లీలాకృష్ణా హైకోర్టులో పిల్‌ వేశారు. న్యాయవాది తులసిదుర్గాంబ వాదనలు వినిపిస్తూ కళ్ల ముందు ఇసుక తవ్వకాలు జరుగుతున్నా తహసీల్దార్, పోలీసులు మౌనంగా ఉంటున్నారని అన్నారు. తవ్వకాల ఫొటోలను కోర్టు దృష్టికి తెచ్చారు.

ఇసుకను ఊడ్చేస్తున్న వైసీపీ నేతలు- ఎన్జీటీ విచారణలో అధికారులకే చిక్కులు!

విచారణ రెండు వారాలకు వాయిదా : గనుల శాఖ ప్రభుత్వ న్యాయవాది నవీన్‌ వాదనలు వినిపించారు. అక్కడ తవ్వుతోంది ఇసుక కాదని బుసక అన్నారు. నదిలో తవ్వకాల వ్యవహారం జలవనరుల శాఖ పరిధిలోనిది అన్నారు. చర్యలు తీసుకునే అధికారులకు పిటిషనర్‌ వినతి ఇవ్వకుండా సంబంధం లేని వారికి అందజేశారని అన్నారు. అనుమతులున్నాయా? లేవా? అనే విషయాన్ని కనుక్కొని వివరాలు సమర్పిస్తానని అన్నారు. ఫొటోలను పరిశీలించిన ధర్మాసనం తవ్వకాలు జరుగుతున్నట్లు అభిప్రాయపడింది. తక్షణం నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ప్రతివాదులను నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Collectors Inspections in Sand Reaches : పర్యావరణ అనుమతులు లేకపోయినా దర్జాగా ఇసుక తవ్వేస్తున్నారని, ఎన్జీటీ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ గుంటూరు జిల్లా అమరావతి మండలానికి చెందిన దండా నాగేంద్ర కుమార్‌ ఇటీవల ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి నదుల్లో పరిశీలించి ఈ నెల 14 నాటికి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పలు జిల్లాల కలెక్టర్లు గనులు, జలవనరులు, భూగర్భజల శాఖలతో పాటు కాలుష్య నియంత్రణ మండలి, ప్రత్యేక కార్యదళం అధికారులతో కలిసి వెళ్లి తనిఖీలు చేశారు. అన్ని చోట్లా ఏదో వెళ్లామా? చూశామా? వచ్చామా? అనేలా ముగించారు. ఏయే రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.

కలెక్టర్లతో మేనేజ్​ చేశారు - శాఖ శాటిలైట్ చిత్రాలతో దొరికిపోయారు!

Illegal Sand Mining in AP : అధికార పార్టీకి చెందిన ఏ నేత ఆధ్వర్యంలో అక్రమ దందా సాగుతుందో కలెక్టర్‌ నుంచి అన్ని శాఖల అధికారులకు తెలిసినా అలాంటి రీచ్‌ల జోలికి వెళ్లలేదు. చాలా కాలంగా ఎటువంటి తవ్వకాలు లేని, అప్పుడప్పుడు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించే రీచ్‌ల్లో మాత్రమే తనిఖీలు చేశారు. కలెక్టర్లు తనిఖీ చేయనున్నట్లు ఇసుకాసురులకు ముందే సమాచారం అందడంతో పలు రీచ్‌ల్లో తవ్వకాలకు కొంతసేపు విరామం ఇచ్చారు. కలెక్టర్లు వెళ్లిన వెంటనే ఇసుక దోపిడీ యథావిధిగా కొనసాగింది. సాగుతోంది.

రాష్ట్రంలో ఇసుక దొంగలపై జగన్​ సర్కారు సమాధానమెంటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.