ETV Bharat / sports

ధోనీ స్టైల్​లో వికెట్ కీపింగ్​ - అదరగొట్టిన సంజూ! - Sanju Samson Rajasthan Royals

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 12:32 PM IST

Sanju Samson Rajasthan Royals
Sanju Samson Rajasthan Royals

Sanju Samson Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ తన బ్యాటింగ్​తోనే కాకుండా వికెట్ కీపింగ్ స్కిల్స్​తోనూ ఆకట్టుకుంటుంటాడు. అయితే తాజాగా ఈ స్టార్ క్రికెటర్ చేసిన ఓ స్టంట్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే ?

Sanju Samson Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తాజాగా పంజాబ్ జట్టు ప్లేయర్ లివింగ్​స్టోన్​ను రనౌట్ చేసిన తీరు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. అతడి స్కిల్స్​కు ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ సంజూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఇతడి వికెట్ కీపింగ్‌ స్టైల్​ను చూసి ధోని గుర్తొచ్చారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

రాజ‌స్థాన్ రాయ‌ల్స్, పంజాబ్ కింగ్స్‌ మధ్య శనివారం (ఏప్రిల్ 13న) ఉత్కంఠ పోరు జరిగింది. అయితే ఆఖరి వరకు పోరాడినప్పటికీ పంజాబ్ జట్టు ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్​లో జరిగిన ఓ ఘటన గురించి క్రికెట్ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు. పంజాబ్ ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్​ను చాహ‌ల్ వేయగా, అందులోని ఐదో బంతిని పంజాబ్ బ్యాట‌ర్ అషుతోష్ శ‌ర్మ డీప్ మిడ్ వికెట్ దిశ‌గా ఆడాడు. బాల్ ఫోర్​ వైపుకు దూసుకెళ్తున్న సమయంలో క్రీజులో ఉన్న వాళ్లు పరిగెట్టడం మొదలెట్టారు.

అయితే మొద‌టి ప‌రుగు చేసిన తర్వాత రెండో ప‌రుగు కోసం ప్ర‌య‌త్నిస్తున్న సమయంలో బంతి ఫీల్డ‌ర్ దగ్గరకి వెళ్ల‌డం వల్ల అశుతోష్ శ‌ర్మ వెన‌క్కి త‌గ్గ‌ాడు. కానీ లివింగ్​స్టోన్ మాత్రం అప్ప‌టికే చాలా దూరం వ‌చ్చాడు. దీంతో బాల్​ను చూసి అతడు కూడా మ‌ళ్లీ వికెట్ల వైపుగా ప‌రిగెత్తాడు. కానీ అంతలోనే ఫీల్డ‌ర్ విసిరిన త్రో వికెట్ల‌కు కొంచెం దూరంలో రాగా, ఆ బంతిని వేగంగా అందుకుని సంజూ వికెట్ల‌ను చూడ‌కుండానే బలంగా విసిరాడు. అప్ప‌టికి లివింగ్​స్టోన్ క్రీజును చేర‌క‌పోవ‌డం వల్ల అతడు ర‌నౌట్​గా వెనుతిరిగాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అచ్చం ధోనీలాగే చేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే- తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు స్కోర్ చేసింది. ఓపెనర్లు అథర్వ టైడే (15 పరుగులు), జానీ బెయిర్ స్టో (15 పరుగులు) విఫలమయ్యారు. వన్​డౌన్​లో వచ్చిన ప్రభ్​సిమ్రన్ సింగ్ (10), శామ్ కర్రన్ (6), శశాంక్ సింగ్ (9) కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు నమోదు చేయలేదు.

జితేశ్ శర్మ (29 పరుగులు), లివింగ్​స్టోన్ (21 పరుగులు) ఫర్వాలేదనిపించారు. చివర్లో అశుతోశ్ శర్మ (31 పరుగులు, 16 బంతుల్లో) రాణించడం వల్ల పంజాబ్ ఆ మాత్రమ స్కోరైనా చేయగలిగింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2, ఆవేశ్ ఖాన్ 2, ట్రెంట్ బోల్ట్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఈ నలుగురు మోత మోగించేస్తున్నారు! - IPL 2024 Westindies Cricketers

10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం​ IPL నుంచి ముంబయి బౌలర్ ఔట్ - ఇదేం రీజన్ రా బాబు!- నిజమెంత? - Kwena Maphaka IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.