ETV Bharat / sports

14 ఏళ్ల క్రితం సచిన్ డబుల్ సెంచరీ - వన్డే హిస్టరీలో బెస్ట్ మూమెంట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 2:13 PM IST

Etv Bharat
Etv Bharat

Sachin ODI Double Century : క్రికెట్​ లవర్స్ మరచిపోలేని రోజుల్లో ఫిబ్రవరీ 24 ఒకటి. 14 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మాస్టర్ బ్లాస్టర్​ సచిన్​ వన్డే హిస్టరీలో ఓ అరుదైన ఘనతను సాధించాడు.

Sachin ODI Double Century : క్రికెట్ లవర్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే మూమెంట్స్​ హిస్టరీలో చాలానే ఉన్నాయి. అయితే అందులో ఫిబ్రవరి 24కి మాత్రం మరింత ప్రత్యేకత ఉంది. ఎందుకుంటే సరిగ్గా 14 ఏళ్ల క్రితం భారత జట్టు మాజీ ప్లేయర్​, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వన్డేలో ఓ ఘనతను సాధించాడు. అదేంటంటే ?

2010, 24 ఫిబ్రవరి న గ్వాలియర్‌ వేదికగా సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్​ జరిగింది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్​లో సచిన్​ ద్విశతకం బాది రికార్డుకెక్కాడు. దిగ్గజ ప్లేయర్​కు ఇదంతా కామనే కదా అని అనుకుంటే మీరు పొరబడట్లే. సుమారు 37 ఏళ్ల వయసులో సచిన్ ఈ రికార్డును అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మ్యాచ్ సాగిందిలా :
ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. సీనియర్ బ్యాటర్, ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ మైదానంలోకి దిగాడు. అయితే ఎన్నో ఆశల నడుమ ఆయన క్రీజుల్లోకి రాగా, కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. పార్నెల్‌ బౌలింగ్‌లో స్టెయిన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్​ బాట పట్టాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన దినేశ్‌ కార్తీక్​తో కలిసి సచిన్​ జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్​ ఇచ్చాడు. ఈ ద్వయం తమ పార్ట్​నర్​షిప్​లో రెండో వికెట్‌ సమయానికి 194 పరుగుల భారీ స్కోర్​ను సాధించారు. 79 పరుగులు మాత్రమే చేయగలిగిన దినేశ్, 34వ ఓవర్‌లో​ అనుహ్యంగా ఔటయ్యాడు.

ఇక ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన యూసఫ్​ పఠాన్‌ కూడా 36 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్స్​లు బాదినప్పటికీ జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో జట్టును కాపాడటం ఇక ధోనీ వంతు అయ్యింది. 42వ ఓవర్‌లో బరిలోకి దిగిన ధోనీ తన ధనాధన్ ఇన్నింగ్స్​తో ప్రత్యర్థులను ఓ ఆట ఆడేసుకున్నాడు. అప్పటికే క్రీజులో ఉన్న సచిన్‌ శతకం బాది డబుల్​ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. కానీ సచిన్‌కి స్ట్రైక్‌ ఇవ్వకుండా ధోనినే బ్యాటింగ్‌ చేయడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచిన్ ఎలాగైనా డబుల్ సెంచరీ చేయాలంటూ కోరుకుంటున్నారు.

ఎందుకంటే వన్డే క్రికెట్‌ చరిత్రలో అంతకముందు ఎప్పుడూ ఏ బ్యాటర్‌ కూడా డబుల్‌ సెంచరీ సాధించలేదు. దీంతో సచిన్​ ఇన్నింగ్స్​పై క్రికెట్ లవర్స్ కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే కొద్ది సేపటికే తాము కలలు కన్న తరుణం రానే వచ్చింది. 147 బంతుల్లోనే సచిన్​ తన డబుల్​ సెంచరీ మార్క్​ను సాధించాడు. టీమ్ఇండియా ఇన్సింగ్ చివరి ఓవర్​లో చార్ల్‌ లాంగ్‌వెల్ట్‌ వేసిన మూడో బంతికి సచిన్‌ సింగిల్‌ తీశాడు. అలా వన్డే క్రికెట్‌లో తొలి ద్విశతకం చేసిన ప్లేయర్​గా చరిత్రకెక్కాడు.

భూతల స్వర్గంలో క్రికెట్ ఆడిన లిటిల్ మాస్టర్

ఫ్యాన్ మూమెంట్ - అభిమానికి సర్​ప్రైజ్ ఇచ్చిన క్రికెట్​ గాడ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.