ETV Bharat / sports

60ఏళ్ల తర్వాత దాయాది గడ్డపై మ్యాచ్​ - భారత్‌ 2 పాక్‌ 0

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 7:10 AM IST

Updated : Feb 4, 2024, 10:47 AM IST

60ఏళ్ల తర్వాత దాాయాది గడ్డపై మ్యాచ్​ - భారత్‌ 2 పాక్‌ 0
60ఏళ్ల తర్వాత దాాయాది గడ్డపై మ్యాచ్​ - భారత్‌ 2 పాక్‌ 0

Davis Cup India Pakisthan : పాకిస్థాన్‌ గడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత డేవిస్‌కప్‌ ఆడుతున్న భారత్‌ శుభారంభం చేసింది. ఆ వివరాలు.

Davis Cup India Pakisthan : పాకిస్థాన్‌ గడ్డపై సుదీర్ఘ విరామం దాదాపు 60ఏళ్ల తర్వాత డేవిస్‌ కప్‌ ఆడుతున్న భారత్‌ శుభారంభం చేసింది. ఇస్లామాబాద్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా మొదలైన ప్రపంచ గ్రూప్‌-1 ప్లేఆఫ్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌, శ్రీరామ్‌ బాలాజీ అదరగొట్టారు. తొలి రెండు సింగిల్స్‌ను గెలిచారు. దీంతో భారత్​ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 6-7 (3-7), 7-6 (7-4), 6-0తో అసిమ్‌ ఖురేషిను ఓడించాడు. గ్రాస్‌ కోర్టుపై జరుగుతున్న ఈ పోరులో తొలి సింగిల్స్​లో ఖురేషి - రామ్‌కుమార్‌కు గట్టి పోటీనే ఇచ్చాడు. తొలి సెట్‌ ఆరంభంలోనే రామ్‌కుమార్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి 3-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ ఆ తర్వాత రామ్​కుమార్​ మెరుపు సర్వీసులు, బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో ఖురేషి సర్వీస్‌ బ్రేక్‌ చేసి స్కోరు సమం చేశాడు. ఇద్దరూ పోటాపోటీగా ఆడడంతో సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేకర్‌లో రామ్‌కుమార్‌ తడబడడం వల్ల ఖురేషి సెట్‌ గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాడు.

రెండో సెట్​ కూడా హోరాహోరీగా సాగింది. రామ్‌కుమార్‌ మెరుపు విన్నర్లు బాదితే, ఖురేషి పదునైన బ్యాక్‌హ్యాండ్‌ షాట్లను ఆడాడు. ఈ సెట్‌ కూడా టైబ్రేకర్‌కు మళ్లింది. కానీ ఇందులో రామ్‌ కుమార్‌ 4-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అంతే కాదు ఈ రెండో సెట్‌ గెలిచి మ్యాచ్‌ను మూడో సెట్‌ వరకు తీసుకెళ్లాడు.

ఇక ఈ నిర్ణయాత్మక సెట్లో రామ్‌ కుమార్‌ ధాటికి ప్రత్యర్థి ఖురేషి నిలబడలేకపోయాడు. ఏస్‌లతో చెలరేగిన రామ్‌కుమార్‌ ఒక్క గేమ్‌ కూడా ఖురేషికి ఇవ్వలేదు. 6-0తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.

రెండో సింగిల్స్‌లో శ్రీరామ్‌ 7-5, 6-3తో అకీల్‌ఖాన్​పై విజయం సాధించాడు. ఈ పోరులోని రెండు సెట్లలో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన శ్రీరామ్‌ మెరుపు సర్వీసులు, డ్రాప్‌షాట్లతో తేలిగ్గానే మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.

ఇక నేడు(ఫిబ్రవరి 4) ఆదివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో సాకేత్‌ మైనేని-యుకి బాంబ్రి ద్వయం ముజామిల్‌-బర్కతుల్లా జోడీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్రపంచ గ్రూప్‌-1 దశకు భారత్‌ అర్హత సాధించినట్టే. ఓడితే మాత్రం రివర్స్‌ సింగిల్స్‌ ఆడాల్సిన అవసరం ఉంటుంది.

రెండో సారి తల్లిదండ్రులు కానున్న విరుష్క జంట - ఏబీడీ క్లారిటీ

'యశస్వి క్రికెట్ వెర్షన్ ఆఫ్ మనోజ్ శర్మ'- జైశ్వాల్ జర్నీ '12th ఫెయిల్' సినిమాలాంటిదే!

Last Updated :Feb 4, 2024, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.