ETV Bharat / politics

ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ సమీక్ష - రెండు రోజుల్లో బదిలీలు పూర్తి చేయాలని ఆదేశం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 1:50 PM IST

AP CS Jawahar Reddy Review: ఎన్నికల విధులతో సంబంధం కలిగి, మూడు సంవత్సరాలు ఒకే స్థానంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారుల బదిలీలు రెండు రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.

AP_CS_Jawahar_Reddy_Review
AP_CS_Jawahar_Reddy_Review

AP CS Jawahar Reddy Review: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయమైన కలెక్టరేట్​లు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు 982 పోస్టులను మంజూరు చేస్తున్నట్టు ఏపీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పోస్టులను త్వరితగతిన భర్తీ చేసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుంచి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.

ఎన్నికలతో సంబంధం ఉండి మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వివిధ శాఖల అధికారుల బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు. ఇప్పటికే పీఆర్ అండ్ ఆర్డీ, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరోల్లో బదిలీల ప్రక్రియ పూర్తి అయిందని అన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల్లో కొంత మేరకు బదిలీలు జరగాల్సి ఉందని ఒకటి రెండు రోజుల్లో వాటిని పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్‌ జవహర్ రెడ్డి సమీక్ష

రాష్ట్ర సరిహద్దులతో పాటు అంతర్గతంగానూ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాల్సి ఉందని సీఎస్ స్పష్టం చేశారు. ఇప్పటికే 105 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, 20 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ప్రత్యేకంగా పోలీసు శాఖ 62 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఎన్​ఫోర్సుమెంట్ బ్యూరో, అటవీ శాఖలు కూడా 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

నెల రోజులుగా అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు ద్వారా 2 కోట్ల 35 లక్షల రూపాయల నగదు, 51 వేల 143 లీటర్ల మద్యం, 1323 కిలోల వివిధ మాదక ద్రవ్యాలను, ఇతర విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పించాల్సిందిగా సీఎస్ సూచించారు.

సార్వత్రిక ఎన్నికల కోసం - సర్వం సిద్దం చేస్తున్న సీఎస్

అయితే ఎన్నికల సన్నద్ధతపై ఇప్పటికే పలుమార్లు జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపైన సీఎస్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను పోలీసు అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లు, కనీస మౌలికవసతుల్ని ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలన్నారు.

అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పని సరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు లైట్లు, ప్యాన్లు, ఫర్నిచర్, త్రాగునీరు, టాయిలెట్లు తప్పని సరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మరోవైపు అక్రమ మద్య రవాణాను అరికట్టటంతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు, చెక్ పోస్టులు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, విచారణలోని కేసులపై చార్జిషీట్లు దాఖలు తదితర అంశాలను పోలీసు అధికారులతో సమీక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.