ETV Bharat / politics

నేడు ప్రధాని మోదీని కలవనున్న సీఎం జగన్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 7:11 AM IST

CM Jagan Meet PM Narendra Modi in Delhi
CM Jagan Meet PM Narendra Modi in Delhi

AP CM Jagan to Meet PM Narendra Modi in Delhi: ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ నేడు ప్రధాని మోదీని కలవనున్నారు. ఆయన గురువారం రాత్రి దిల్లీకి బయలుదేరారు. ప్రధానిని కలిసిన అనంతరం వీలును భట్టి కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులను కలవనున్నట్లు తెలిసింది. అలాగే రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమిత్​షా, జేపీ నడ్డాలను కలిశారు.

AP CM Jagan to Meet PM Narendra Modi in Delhi : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రధాని మోదీని కలవనున్నారు. గురువారం రాత్రి దిల్లీకి వెళ్లిన ఆయన తన అధికారిక నివాసమైన 1-జనపథ్‌లో బస చేశారు. ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం భేటీ కానున్నారు. ప్రధానిని కలిసిన తర్వాత వీలును బట్టి కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

TDP Leader Chandrababu Naidu Meet Amit Shah: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11.25 గంటల సమయంలో అమిత్‌షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురూ సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. నడ్డా, షాలతో రాత్రి ఏడున్నరకు భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే రాత్రి పొద్దుపోయేవరకూ పార్లమెంటు ఉభయసభలు సాగడంతో వారిద్దరూ పార్లమెంటులోనే ఉండిపోయారు. దాంతో రాత్రి 11.25 గంటలకు చంద్రబాబు వారితో సమావేశం అయ్యారు. 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే చంద్రబాబు కన్నా 10 నిమిషాల ముందే జేపీ నడ్డా అమిత్​షా నివాసం నుంచి వెళ్లిపోయారు. తర్వాత చంద్రబాబు షా నివాసం నుంచి వెళ్లిపోయారు.

నారా లోకేశ్‌ శంఖారావం - ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం

బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఇటీవల ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందు షా, నడ్డాలతో భేటీ అయ్యారు. తర్వాత కమలనాథులు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అంతకు ముందు దిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. తర్వాత ఆయన హోటల్‌కు వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకొని రాత్రి గల్లా ఇంటికి చేరుకుని పార్టీ ఎంపీలు, ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు.

దిల్లీ చేరుకున్న చంద్రబాబు - కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో సమావేశం

Chandrababu Naidu Meet JP Nadda in Delhi: చంద్రబాబు దిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దిల్లీ బయలుదేరే ముందు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ ముఖ్య నేతలతో తాజా రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. దిల్లీ నుంచి పిలుపు వచ్చిందని నేతలతో చంద్రబాబు అన్నారు. అక్కడకు వెళ్లాకే ఎందుకు పిలిచారు ఏంటి అనేది తెలుస్తుందని నేతలతో చంద్రబాబు అన్నట్లు సమాచారం. అక్కడ సమావేశం అనంతరం సీట్ల నియామకంపై చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలుగుదేశం నేతలతో అన్నట్లు తెలుస్తోంది.

నేడు దిల్లీ వెళ్లనున్న పవన్‌ కల్యాణ్ - అమిత్‌షాను కలిసే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.