అయోధ్యలో వాటర్ మెట్రో- సూపర్ ఫీచర్లతో సరయూలో జర్నీ!
Published : Jan 28, 2024, 8:09 PM IST
Water Metro In Ayodhya : అయోధ్యలో పర్యటక అభివృద్ధి, రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు కేంద్రం సహకారంతో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కృషిచేస్తుంది. అయోధ్యలోని సరయూ నదిపై 'వాటర్ మెట్రోను' అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు అయోధ్యలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల స్థానికంగా ఉన్న ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కార్మికశాఖ సహాయమంత్రి రాజ్భర్ చెప్పారు.