ETV Bharat / entertainment

అంతా పాన్ ఇండియా మయం - పక్క ఇండస్ట్రీలపై తెలుగు నిర్మాతల ఫోకస్

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 7:03 PM IST

Etv Bharat
Etv Bharat

పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న కొద్ది నిర్మాణ సంస్థలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే పలువురు తెలుగు నిర్మాతలు తమ నిర్మాణ సంస్థల ద్వారా ఇతర ఇండస్ట్రీల్లో అడుగుపెట్టి సక్సెస్​ సాధించారు. ఇప్పుడు అదే ట్రెండ్​ను ఫాలో అవుతూ మరికొందరు ప్రొడ్యూసర్లు పర భాషా సినిమాలను నిర్మిస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవంటే ?

Telugu Producers For Other Language Movies : నటీనటులు, డైరెక్టర్లు లాగానే నిర్మాతలు కూడా భాషా బేధం లేకుండా ఇతర లాంగ్వేజ్​ సినిమాలను నిర్మించడం ఇప్పుడు ట్రెండ్​గా మారిపోయింది. గతేడాది దిల్ రాజు దళపతి విజయ్​తో 'వారిసు' అనే సినిమాను నిర్మించారు. అది తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి టాక్​ అందుకుంది. అదే ఊపుతో ఇప్పుడు దిల్​ రాజు మరిన్ని సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

తెలుగులో హిట్ అయిన 'ఎఫ్ 2' సినిమాను బోనికపూర్​తో కలిసి హిందీలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే జెర్సీ, హిట్: ది ఫస్ట్ కేస్ సినిమాలను ఆయన హిందీలో నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే దిల్​ రాజులాగే మరికొందరు స్టార్​ నిర్మాతలు ఇతర భాషల సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకీ వారెవరంటే ?

మైత్రి మూవీ మేకర్స్ : మహేశ్​ బాబు 'శ్రీమంతుడు' సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది మైత్రీ సంస్థ. అప్పుడు హిట్ అందుకున్న మైత్రి, గత తొమ్మిదేళ్లుగా ఎన్నో బ్లాక్​ బస్టర్ సినిమాలను తెరకెక్కించింది. అయితే తెలుగులోనే అన్ని సినిమాలను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు కోలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ స్టార్ హీరో అజిత్ లీడ్ రోల్​లో రానున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. దీంతో పాటు మలయాళ స్టార్ హీరో టోవినో థామస్​తో 'నడిగర్' అనే సినిమాను నిర్మిస్తోంది.

ఇదిలా ఉండగా, బాలీవుడ్​లోనూ మైత్రీ తన జెండా పాతింది. డైరెక్టర్​ గోపీచంద్ మలినేని సన్నిదేఓల్​ కాంబినేషన్​లో వస్తున్న సినిమాతో పాటు, సల్మాన్ ఖాన్​తో కూడా ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.

డీవీవీ ఎంటర్​టైన్మెంట్స్ : ఈ సంస్థ కూడా ఇప్పుడు పర భాషా చిత్రాల నిర్మాణంపై ఆసక్తి చూపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్​తో ఒక సినిమా చేయనుంది. అంతేకాకుండా ఇటీవలే సూపర్ హిట్ అయిన 'బేబీ' సినిమాను కూడా హిందీలో నిర్మించనుంది.

పీపుల్స్ మీడియా ఫాక్టరీ సంస్థ : ఇప్పటికే కోలీవుడ్​లో మూడు చిత్రాలను, శాండిల్​వుడ్​లో మూడు చిత్రాలను నిర్మించింది. తాజాగా బెంగాలీలో కాళీ సినిమాను నిర్మిస్తోంది.

వారాహి చలన చిత్రం : 'అందాల రాక్షసి' సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన వారాహి సంస్థ ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలను నిర్మించింది. ఇప్పుడు పొలిటికల్ లీడర్ గాలి జనార్ధన్ రెడ్డి తనయుడితో తెలుగు, కన్నడ బాషల్లో ఒక సినిమాను నిర్మించనుంది.

గీత ఆర్ట్స్ : ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ ఇప్పటికే పలు చిత్రాలను హిందీలో నిర్మించింది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో 'రామాయణ్​' సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తెలుగు నిర్మాతలతో కోలీవుడ్ స్టార్స్ - ఈ కాంబో సూపర్ హిట్టే!

Tollywood: ఈ వారసురాళ్లు యమా స్పీడు.. నిర్మాణంలో జోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.