ETV Bharat / business

స్పెషల్ ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 9:51 AM IST

Updated : Mar 2, 2024, 12:42 PM IST

Share Market Today March 2nd 2024
Stock Market All Time High Today

Stock Market Today March 2nd 2024 : శనివారం నిర్వహించిన స్పెషల్​ ట్రేడింగ్ సెషన్​లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 58 పాయింట్లు లాభపడి 73,804 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్లు వృద్ధి చెంది 22,376 వద్ద స్థిరపడింది.

12.30 PM : శనివారం నిర్వహించిన రెండో ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. మూడో త్రైమాసికంలో ఇండియన్ జీడీపీ 8.4 శాతం మేర పెరిగింది. విదేశీ పెట్టుబడులు కూడా భారీగా తరలి వచ్చాయి. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్లు స్పెషల్ ట్రేడింగ్ సెషన్​లో భారీ లాభాలను మూటగట్టుకున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 58 పాయింట్లు లాభపడి 73,804 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 37 పాయింట్లు వృద్ధి చెంది 22,376 వద్ద స్థిరపడింది.

  • లాభపడిన షేర్లు : టాటా స్టీల్​, టాటా మోటార్స్, విప్రో, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్​, ఎస్​బీఐ, టీసీఎస్​, భారతీ ఎయిర్​టెల్​
  • నష్టపోయిన షేర్లు : ఎం అండ్ ఎం, ఎన్​టీపీసీ, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్​, సన్​ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్​, రిలయన్స్​

12.00 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 94 పాయింట్లు లాభపడి 73,839 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 45 పాయింట్లు వృద్ధి చెంది 22,384 వద్ద కొనసాగుతోంది.

11.30 AM : సెకెండ్​ ట్రేడింగ్ సెషన్​లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 145 పాయింట్లు లాభపడి 73,890 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 55 పాయింట్లు వృద్ధి చెంది 22,394 వద్ద కొనసాగుతోంది.

10.00 AM : శనివారం నిర్వహించిన ఫస్ట్ స్పెషల్​ ట్రేడింగ్ సెషన్​లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు జీవన కాల గరిష్ఠాల వద్ద ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 114 పాయింట్లు లాభపడి 73,860 వద్ద ట్రేడ్​ ఆల్​-టైమ్​ హై లెవల్స్ వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 56 పాయింట్లు వృద్ధి చెంది 22,395 జీవనకాల గరిష్ఠాల వద్ద స్థిరపడింది.

Stock Market Today March 2nd 2024 : శనివారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ స్పెషల్ ట్రేడింగ్ సెషన్​లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్​, నిఫ్టీలు జీవన కాల గరిష్ఠాలను తాకాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 236 పాయింట్లు లాభపడి 73,982 వద్ద ఆల్​-టైమ్​ హై రికార్డును తాకింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 81 పాయింట్లు వృద్ధి చెంది 22,420 రికార్డ్ పీక్​ను టచ్​ చేసింది. మూడో త్రైమాసికంలో ఇండియన్ జీడీపీ 8.4 శాతం మేర పెరగడం సహా, విదేశీ పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయి. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్లు స్పెషల్ ట్రేడింగ్ సెషన్​లోనూ భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 114 పాయింట్లు లాభపడి 73,860 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 56 పాయింట్లు వృద్ధి చెంది 22,395 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టాటా స్టీల్​, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎస్​బీఐ, విప్రో, ఏసియన్ పెయింట్స్
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్ బ్యాంక్​, టైటాన్​, పవర్​గ్రిడ్​, భారతీ ఎయిర్​టెల్​

స్పెషల్ ట్రేడింగ్ సెషన్స్
శనివారం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ (BSE), జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) రెండు స్పెషల్ ట్రేడింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. మొదటి సెషన్​ ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటలు వరకు కొనసాగుతుంది. రెండో సెషన్​ ఉదయం 11.30 గంటల నుంచి 12.30 మధ్య జరుగుతుంది. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా స్టాక్ మార్కెట్​ ట్రేడింగ్​ను సజావుగా నిర్వహించేందుకు, విపత్తు సంసిద్ధతను అంచనా వేసేందుకు ఈ రెండు స్పెషల్​ సెషన్స్​ను​ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ట్రేడింగ్ సెషన్​ను ఎన్​ఎస్​ఈ ప్రైమరీ వెబ్​సైట్​లో, రెండో ట్రేడింగ్ సెషన్​ను స్టాక్ ఎక్స్ఛేంజీకి సంబంధించిన రికవరీ సైట్​లో నిర్వహిస్తారు.

సెబీ మార్గదర్శకాల ప్రకారం
సాధారణంగా శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. అయితే డిజాస్టర్ రికవరీ సైట్​ (డీఆర్​ఎస్​), బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్ (బీసీపీ) ఫ్రేమ్​వర్క్​ను ఏర్పాటు చేసేందుకు సెక్యూరిటీస్​ అండ్ ఎక్స్ఛేంజ్​ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్గదర్శకాలను రూపొందించింది. వాటికి అనుగుణంగానే ఎన్​ఎస్​ఈ, బీఎస్​ఈలు ఈ స్పెషల్ లైవ్​ ట్రేడింగ్​ను నిర్వహిస్తున్నాయి.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,245 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.

ముడి చమురు ధర
Crude Oil Prices March 2nd 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 2 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 83.55 డాలర్లుగా ఉంది.

రూ.2000 నోట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన - 97.62% నోట్లు వాపస్​!

ఎస్​బీఐ డెబిట్ కార్డును యాక్టివేట్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

Last Updated :Mar 2, 2024, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.