ETV Bharat / business

ఫిబ్రవరి 12 నుంచి గోల్డ్ బాండ్ సబ్​స్క్రిప్షన్​ - వారికి ప్రత్యేక డిస్కౌంట్ - ఎలా అప్లై చేయాలంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 7:09 PM IST

Gold Bonds 2024 Subscription In Telugu : సావరిన్ గోల్డ్ బాండ్ 2023-24 సిరీస్​ నాలుగో విడత సబ్​స్క్రిప్షన్​ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానుంది. ఆర్​బీఐ ఒక గ్రాము బంగారం ధరను (ఇష్యూ ప్రైస్​) రూ.6,199గా నిర్ణయించింది. ఆన్​లైన్​లో అప్లై చేసే వారికి ఒక్కో గ్రాముపై రూ.50 వరకు డిస్కౌంట్​ లభిస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం.

SGB 2023-24 Series IV
Gold Bonds 2024 Subscription

Gold Bonds 2024 Subscription : సావరిన్ గోల్డ్ బాండ్​ 2023-24 సిరీస్​ నాలుగో విడత సబ్​స్క్రిప్షన్​ ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 వరకు ఈ గోల్డ్​ బాండ్​ సబ్​స్క్రిప్షన్​ కోసం అప్లై చేసుకోవచ్చు.

గ్రాము ధర ఎంతంటే?
Sovereign Gold Bonds Series IV : ఆర్​బీఐ ఒక గ్రాము బంగారం ఇష్యూ ధరను రూ.6199గా నిర్ణయించింది. ఆర్​బీఐ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికానికి ఒకటి చొప్పున మొత్తం 4 సార్లు గోల్డ్ బాండ్లు ఇష్యూ చేస్తుంది. ఇంతకు ముందు 2023 జూన్‌లో మొదటి విడత, సెప్టెంబర్‌లో రెండో విడత, డిసెంబర్​లో మూడో విడత పసిడి బాండ్లను విడుదల చేసింది. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో నాలుగో సిరీస్​ గోల్డ్​ బాండ్లను విడుదల చేయనుంది.

డిస్కౌంట్​ వారికి మాత్రమే!
Sovereign Gold Bond Discount Price : ఆన్‌లైన్‌లో పసిడి బాండ్లు కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 చొప్పున డిస్కౌంట్‌ ఇస్తారు. అంటే ఆన్​లైన్​లో కొనుగోలు చేసేవారికి ఒక గ్రాము బంగారం రూ.6,149కే లభిస్తుంది.

బంగారం ధర ఎలా నిర్ణయిస్తారంటే?
దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలనే ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఈ పసిడి బాండ్ల పథకాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ పసిడి బాండ్ల ధరను ఎలా నిర్ణయిస్తారంటే, సబ్‌స్క్రిప్షన్‌ ముందు వారంలోని చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ ఒక సగటు ధరను నిర్ణయిస్తుంది. ఇలా నిర్ణయించిన సగటు ధర ఆధారంగా గ్రాము బంగారం రేటును నిర్ణయిస్తారు. సబ్​స్క్రైబర్లు కనీసం 1 గ్రామును ఒక యూనిట్‌ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఎంత బంగారం కొనవచ్చు?
Sovereign Gold Bond Subscription Limit : ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు అయితే 20 కేజీల వరకు గోల్డ్ కొనవచ్చు. ఈ గోల్డ్​ బాండ్‌ పీరియడ్‌ 8 ఏళ్లు. గడువు ముగిసిన తరువాత, అప్పటికి ఉన్న ధరను చెల్లిస్తారు. సబ్​స్క్రైబర్లు కావాలంటే, ఐదేళ్ల తర్వాత ఈ పథకం నుంచి వైదొలగవచ్చు. భౌతిక బంగారం కొనుగోలుకు ఉన్న కేవైసీ నిబంధనలే గోల్డ్ బాండ్స్​కు కూడా వర్తిస్తాయి.

ఎక్కడ అప్లై చేయాలి?
How To Subscribe Sovereign Gold Bond : షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీస్​లు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టాక్‌ ఎక్స్ఛేంజ్​ (NSE, BSE)ల్లో ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్​​ కోసం అప్లై చేసుకోవచ్చు.

ఎవరు అప్లై చేసుకోవచ్చు?
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను భారతీయ పౌరులు, ట్రస్ట్‌లు, హెచ్‌యూఎఫ్‌లు, స్వచ్ఛంద సంస్థలు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. వీటిని మైనర్‌ పిల్లల తరఫున కూడా కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి స్వయంగా లేదా ఇతర వ్యక్తులతో కలిసి జాయింట్‌గా కూడా పసిడి బాండ్లను కొనవచ్చు.

వడ్డీ ఎంత వస్తుంది?
Sovereign Gold Bond Interest Rate : పసిడి బాండ్లపై ఇష్యూ తేదీ నుంచి వడ్డీ ప్రారంభమవుతుంది. గోల్డ్​ బాండ్‌ నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.

పన్ను ప్రయోజనాలు
Sovereign Gold Bond Tax Benefits : సావరిన్ గోల్డ్ బాండ్​ మెచ్యూరిటీపై వచ్చే మూలధన లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఐదేళ్లు గడిచిన తరువాత బాండ్లను విక్రయిస్తే, స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే 3 సంవత్సరాల తర్వాత బదిలీ చేస్తే, వ్యక్తికి దీర్ఘకాలిక మూలధన లాభాల కింద ఇండెక్సేషన్‌ అనంతరం 20 శాతం పన్ను వర్తిస్తుంది.

పసిడి బాండ్లు లాభదాయకమేనా?
భౌతిక బంగారంతో పోల్చి చూస్తే, సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. బంగారు నగలు కొనుగోలు చేసేటప్పుడు, సాధారణంగా మేకింగ్‌ ఛార్జీలు, జీఎస్టీ లాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ గోల్డ్‌బాండ్ల విషయంలో ఇవి ఉండవు. చోరీ భయం అనేది అసలే ఉండదు. అందుకే సురక్షిత పెట్టుబడులు పెట్టాలని ఆశించేవారు గోల్డ్ బాండ్స్ కొనడం బెటర్​ ఆప్షన్ అవుతుంది.

సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? తప్పనిసరిగా ఈ 5 విషయాలు చెక్​ చేసుకోండి!

పేటీఎం యూజర్లకు అలర్ట్- ఆ రోజు నుంచి డిపాజిట్స్ బంద్​!

Gold Bonds 2024 Subscription : సావరిన్ గోల్డ్ బాండ్​ 2023-24 సిరీస్​ నాలుగో విడత సబ్​స్క్రిప్షన్​ ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 వరకు ఈ గోల్డ్​ బాండ్​ సబ్​స్క్రిప్షన్​ కోసం అప్లై చేసుకోవచ్చు.

గ్రాము ధర ఎంతంటే?
Sovereign Gold Bonds Series IV : ఆర్​బీఐ ఒక గ్రాము బంగారం ఇష్యూ ధరను రూ.6199గా నిర్ణయించింది. ఆర్​బీఐ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికానికి ఒకటి చొప్పున మొత్తం 4 సార్లు గోల్డ్ బాండ్లు ఇష్యూ చేస్తుంది. ఇంతకు ముందు 2023 జూన్‌లో మొదటి విడత, సెప్టెంబర్‌లో రెండో విడత, డిసెంబర్​లో మూడో విడత పసిడి బాండ్లను విడుదల చేసింది. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో నాలుగో సిరీస్​ గోల్డ్​ బాండ్లను విడుదల చేయనుంది.

డిస్కౌంట్​ వారికి మాత్రమే!
Sovereign Gold Bond Discount Price : ఆన్‌లైన్‌లో పసిడి బాండ్లు కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 చొప్పున డిస్కౌంట్‌ ఇస్తారు. అంటే ఆన్​లైన్​లో కొనుగోలు చేసేవారికి ఒక గ్రాము బంగారం రూ.6,149కే లభిస్తుంది.

బంగారం ధర ఎలా నిర్ణయిస్తారంటే?
దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలనే ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఈ పసిడి బాండ్ల పథకాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ పసిడి బాండ్ల ధరను ఎలా నిర్ణయిస్తారంటే, సబ్‌స్క్రిప్షన్‌ ముందు వారంలోని చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ ఒక సగటు ధరను నిర్ణయిస్తుంది. ఇలా నిర్ణయించిన సగటు ధర ఆధారంగా గ్రాము బంగారం రేటును నిర్ణయిస్తారు. సబ్​స్క్రైబర్లు కనీసం 1 గ్రామును ఒక యూనిట్‌ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఎంత బంగారం కొనవచ్చు?
Sovereign Gold Bond Subscription Limit : ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు అయితే 20 కేజీల వరకు గోల్డ్ కొనవచ్చు. ఈ గోల్డ్​ బాండ్‌ పీరియడ్‌ 8 ఏళ్లు. గడువు ముగిసిన తరువాత, అప్పటికి ఉన్న ధరను చెల్లిస్తారు. సబ్​స్క్రైబర్లు కావాలంటే, ఐదేళ్ల తర్వాత ఈ పథకం నుంచి వైదొలగవచ్చు. భౌతిక బంగారం కొనుగోలుకు ఉన్న కేవైసీ నిబంధనలే గోల్డ్ బాండ్స్​కు కూడా వర్తిస్తాయి.

ఎక్కడ అప్లై చేయాలి?
How To Subscribe Sovereign Gold Bond : షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీస్​లు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టాక్‌ ఎక్స్ఛేంజ్​ (NSE, BSE)ల్లో ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్​​ కోసం అప్లై చేసుకోవచ్చు.

ఎవరు అప్లై చేసుకోవచ్చు?
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను భారతీయ పౌరులు, ట్రస్ట్‌లు, హెచ్‌యూఎఫ్‌లు, స్వచ్ఛంద సంస్థలు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. వీటిని మైనర్‌ పిల్లల తరఫున కూడా కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి స్వయంగా లేదా ఇతర వ్యక్తులతో కలిసి జాయింట్‌గా కూడా పసిడి బాండ్లను కొనవచ్చు.

వడ్డీ ఎంత వస్తుంది?
Sovereign Gold Bond Interest Rate : పసిడి బాండ్లపై ఇష్యూ తేదీ నుంచి వడ్డీ ప్రారంభమవుతుంది. గోల్డ్​ బాండ్‌ నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.

పన్ను ప్రయోజనాలు
Sovereign Gold Bond Tax Benefits : సావరిన్ గోల్డ్ బాండ్​ మెచ్యూరిటీపై వచ్చే మూలధన లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఐదేళ్లు గడిచిన తరువాత బాండ్లను విక్రయిస్తే, స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే 3 సంవత్సరాల తర్వాత బదిలీ చేస్తే, వ్యక్తికి దీర్ఘకాలిక మూలధన లాభాల కింద ఇండెక్సేషన్‌ అనంతరం 20 శాతం పన్ను వర్తిస్తుంది.

పసిడి బాండ్లు లాభదాయకమేనా?
భౌతిక బంగారంతో పోల్చి చూస్తే, సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. బంగారు నగలు కొనుగోలు చేసేటప్పుడు, సాధారణంగా మేకింగ్‌ ఛార్జీలు, జీఎస్టీ లాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ గోల్డ్‌బాండ్ల విషయంలో ఇవి ఉండవు. చోరీ భయం అనేది అసలే ఉండదు. అందుకే సురక్షిత పెట్టుబడులు పెట్టాలని ఆశించేవారు గోల్డ్ బాండ్స్ కొనడం బెటర్​ ఆప్షన్ అవుతుంది.

సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? తప్పనిసరిగా ఈ 5 విషయాలు చెక్​ చేసుకోండి!

పేటీఎం యూజర్లకు అలర్ట్- ఆ రోజు నుంచి డిపాజిట్స్ బంద్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.