ETV Bharat / bharat

ఇకపై శ్వాసతోనే షుగర్ టెస్ట్- రక్తంతో పని లేదు!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 4:50 PM IST

New Diabetes Test Device by IIT Mandi
New Diabetes Test Device by IIT Mandi

Test Blood Sugar With Breath : మన శరీరంలో మధుమేహం స్థాయిని తెలుసుకోవాలంటే కచ్చితంగా రక్తాన్ని తీయాల్సిందే. కానీ హిమాచల్​ప్రదేశ్​లోని ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు రక్తం తీయకుండానే షుగర్​ పరీక్ష చేసేలా ఓ కొత్త పరికరాన్ని తయారు చేశారు.అదెలా పని చేస్తుందో చూద్దాం.

Test Blood Sugar With Breath : భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి మధుమేహం. ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలోనూ ఇది కనిపిస్తోంది. అయితే, ఈ మధుమేహం స్థాయిలను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్​తో పరీక్షించాల్సిందే. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా కేవలం శ్వాసతోనే షుగర్​ స్థాయిలను గుర్తించే పరికరాన్ని రూపొందించారు హిమాచల్​ ప్రదేశ్​లోని ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు. అదెలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

మొదటగా వీరు తయారు చేసిన పరికరంలో మనం శ్వాసను ఊదాలి. ఆ తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్​ యాప్​లో ఆక్సిజన్, బీపీతో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేయాలి. అనంతరం రెండింటి వివరాలను క్రోడీకరించి శరీరంలోని షుగర్​ స్థాయిలను చెబుతోంది పరికరం. దీనికి నాన్​ ఇన్​వాసివ్​ గ్లూకోమీటర్​ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు ఈ పరికరంతో అనేక మందికి పరీక్షలు చేయగా, మెరుగైన ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు సీనియర్​ ప్రాజెక్ట్ డైరెక్టర్​ డాక్టర్ రీతు.

New Diabetes Test Device by IIT Mandi
ఐఐటీ మండీ రూపొందించిన పరికరం

"హిమాచల్​ ప్రదేశ్​ లాంటి కొండ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అంతగా ఉండవు. ఇలాంటి వారి కోసమే ఈ పరికరాన్ని రూపొందించాం. ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, దీనిని వైద్య నిపుణుల పర్యవేక్షణలో రూపొందించలేదు. ఇప్పటి వరకు ఎయిమ్స్​ బిలాస్​పుర్​ వారితో కలిసి సుమారు 560 శాంపిళ్లను పరీక్షించాం. వీటన్నింట్లో ఈ పరికరం మెరుగైన ఫలితాలనే ఇచ్చింది. ఈ పరికరంతో పరీక్షిస్తే ఒక్క శాతం మాత్రమే తప్పుగా వచ్చే అవకాశం ఉంది. అదే గ్లూకోమీటర్​తో చేస్తే ఐదు శాతం తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది."

--డాక్టర్​ రీతు, సీనియర్​ ప్రాజెక్ట్ డైరెక్టర్

గుండెపోటును సైతం గుర్తించేలా!
ఈ పరికరంలో 8-10 మల్టీ సెన్సార్లను అమర్చామని, ఇవి సులభంగా శరీరంలోని షుగర్​ లెవల్స్​ను గుర్తిస్తాయని డాక్టర్ రీతు తెలిపారు. ఇది రూ. 16వేలకే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అయితే, ప్రస్తుతం తమ పరికరం పరిమాణం పెద్దగా ఉందని, దీనిని తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు. షుగర్​ పరీక్షలు మాత్రమే కాకుండా, గుండెపోటు లాంటి ప్రాణాంతక వ్యాధులను సైతం గుర్తించే సెన్సార్లను ఇందులో అమర్చుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇది పరిశోధన దశలో ఉందని, ఇది విజయవంతమైతే గుండెపోటును సైతం ముందే గుర్తించవచ్చని డాక్టర్ రీతు ఆశాభావం వ్యక్తం చేశారు.

New Diabetes Test Device by IIT Mandi
ఐఐటీ మండీ రూపొందించిన పరికరం

ఫింగర్​ ప్రింట్, ఐరిస్​తో కాదు- ఇక శ్వాసతోనే ఫోన్ అన్​ లాక్! ఈ టెక్నాలజీ అదుర్స్​

'వాహనాలు మాట్లాడుకుంటాయ్'- రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా 'ఐఐటీ' సాంకేతికత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.