ETV Bharat / bharat

'కేంద్రం ఆధార్​ కార్డులను డీయాక్టివేట్​ చేస్తుంది'- బంగాల్​ సీఎం దీదీ ఆరోపణలు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 8:43 PM IST

Updated : Feb 18, 2024, 9:57 PM IST

Mamata Banerjee On Aadhar Card
Mamata Banerjee On Aadhar Card

Mamata Banerjee On Aadhar Card Deactivated : బంగాల్‌ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. బీర్​భూమ్​ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ ప్రజాపంపిణీ కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee On Aadhar Card Deactivated : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee on bjp) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఆధార్​ కార్డులను డీయాక్టివేట్​ చేస్తోందని దీదీ విమర్శించారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరనీయడం లేదని ఆరోపించారు. బీర్‌భూమ్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ ప్రజా పంపిణీ కార్యక్రమంలో సీఎం మమతా ఈ మేరకు ఆరోపణలు చేశారు. ఆధార్‌ కార్డు లేకపోయినప్పటికీ అర్హులైన వారికి తమ ప్రభుత్వ పథకాలను అందజేస్తామన్నారు.

'ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి'
'ప్రజలందరూ ఆధార్​ కార్డులు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వమే (mamata banerjee on central government) కోరింది. స్కూల్​ అడ్మిషన్ పొందాలన్నా ఆధార్​ కార్డు అవసరమైంది. ప్రస్తుతం అదే ప్రభుత్వం మీకు ఎలాంటి సమాచారం అందించకుండానే ఆధార్​ కార్డులను డీ యాక్టివేట్​ చేస్తోంది. మీరంతా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వాటిని డీలింక్‌ చేస్తోంది. అయితే రాష్ట్రంలోని ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా సంక్షేమ ఫలాలను దూరం చేయబోం' అని మమతా బెనర్జీ తెలిపారు. ఆధార్​ కార్డులు డియాక్టివేట్​ అయిన వారు ఫిర్యాదు చేసేందుకు ఆన్​లైన్ పోర్టల్​ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. ఆ పోర్టల్​లో ప్రజలు సులభంగా ఫిర్యాదు చేసుకునే విధంగా ఉండాలని సీఎస్​కు సూచించారు.

'మా రాష్ట్రంలోని బ్యాంకులతో చేయించుకోగలం'
'ఆధార్​ కార్డులు లేకుంటే ట్రాన్షాక్షన్లు చేయలేమని బ్యాంకులు భావిస్తున్నట్లయితే, అవి లేకుండా కూడా మేము పనిచేయగలము. మా రాష్ట్రంలో చాలా కో- ఆపరేటివ్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఉన్నాయి. వాటి ద్వారా పనిచేయించుకోగలము' అని సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. హరియాణా, పంజాబ్‌లలో రైతులు చేపడుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ బంగాల్​లోని అన్నదాతలకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పారు. రైతన్నల నిరసనకు సెల్యూట్ చేస్తున్నానని, వారిపై దాడులను ఖండిస్తున్నానని మమత తెలిపారు.

మమతా బెనర్జీకి తప్పిన ప్రమాదం- దీదీ తలకు గాయం

జమిలీ ఎన్నికలపై మమత అభ్యంతరం- కోవింద్ నేతృత్వంలోని కమిటీకి లేఖ

Last Updated :Feb 18, 2024, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.