ETV Bharat / bharat

ఇళయరాజా కేసులో ట్విస్ట్​- 'రైటర్స్ కూడా పాటలపై హక్కు కోరితే ఏమవుతుంది?'- హైకోర్టు సూటి ప్రశ్న - Ilaiyaraaja Songs Controversy

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 11:29 AM IST

Ilaiyaraaja Songs Controversy
Ilaiyaraaja Songs Controversy

Ilaiyaraaja Songs Controversy : పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీ రైట్‌ గడవు ముగిసినా ఇంకా తన పాటలను వాడుకుంటున్నారంటూ మ్యూజిక్‌ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Ilaiyaraaja Songs Controversy : కాపీ రైట్‌ గడవు ముగిసినా ఇంకా తన పాటలను వాడుకుంటున్నారంటూ మ్యూజిక్‌ కంపెనీలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మద్రాస్‌ హైకోర్టు వాయిదా వేసింది. ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీలైన ఎకో, ఏఐజీ కంపెనీలు కాపీ రైట్‌ గడువు ముగిసినా తన అనుమతి లేకుండా పాటలను వాడుకుంటున్నాయని ఇళయరాజా కోర్టులో దావా దాఖలు చేశారు. దీనిపై పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని అంటూ కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలు ఇళయరాజా స్వర పరిచిన 4,500 పాటలను ఉపయోగించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ పాటలకు చేసుకున్న ఒప్పందం ముగిసిన తర్వాత కూడా కాపీరైట్ పొందకుండా తన పాటలను ఉపయోగిస్తున్నారని ఇళయరాజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్​పై విచారించి మద్రాసు హైకోర్టు, నిర్మాతల నుంచి హక్కులను పొందిన తర్వాత ఇళయరాజా పాటలను వినియోగించుకునే హక్కు సంగీత సంస్థలకు ఉంటుందని, ఇళయరాజాకు కూడా వ్యక్తిగతంగా హక్కు ఉంటుందని 2019లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును ఇళయరాజా సవాల్‌ చేశారు. ఆ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు ఆర్. మహదేవన్, జస్టిస్‌ మహ్మద్ షఫీక్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఇళయరాజా పాటలను ఉపయోగించకుండా మ్యూజిక్ కంపెనీలపై మధ్యంతర నిషేధం విధించింది.

'నిర్మాతకే హక్కులు ఉంటాయి'
అనంతరం సినిమా కాపీరైట్‌ నిర్మాత వద్ద ఉందని, వారితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పాటలు ఉపయోగించడానికి అధికారం ఉందని ఎకో తరఫున అప్పీల్‌ చేశారు. సంగీతం అందించినందుకు ఇళయరాజాకు నిర్మాత డబ్బులు చెల్లించారని, అందుకే రైట్స్ నిర్మాతకే దక్కుతాయని కంపెనీల తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. నిర్మాతకే హక్కులు ఉంటాయని వాదించారు. అందుకు ఇళయరాజా తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సతీష్ పరాశరన్, ఈ వాదనను తిరస్కరించారు. మ్యూజిక్ కంపోజిషన్ అనేది క్రియేటివ్ వర్క్, కాపీరైట్ చట్టం వర్తించదని అన్నారు.

ఈ సమయంలో దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక పాట రూపొందేందుకు సాహిత్యం, గాయకుడు సహా చాలామంది అవసరమని, సాహిత్యం లేనిదే పాట లేదని వ్యాఖ్యానించింది. పాటల రచయిత కూడా పాటపై హక్కులు క్లెయిమ్ చేస్తే ఏమవుతుందని ప్రశ్నించింది. అనంతరం కేసు విచారణను న్యాయమూర్తులు జూన్ రెండో వారానికి వాయిదా వేశారు. పాటల విక్రయం ద్వారా ఇళయరాజా పొందిన మొత్తం ఎవరికి చెందుతుందనేది తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల బరిలో ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్! జైలు నుంచే పోటీ! - Lok Sabha Elections 2024

'ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణం'- ప్రత్యేక దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ - ELECTORAL BONDS ISSUE Supreme Court

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.