ETV Bharat / bharat

తల్లిని కొట్టిచంపిన కుమారుడు!- శిక్షగా 6 నెలల సమాజ సేవ- హైకోర్టు కీలక తీర్పు - HC Orders To Do Community Service

author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 2:54 PM IST

karnataka High Court
karnataka High Court (ETV BHARAT)

High Court Orders Accused To Do Community Service : తల్లిని హత్య చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి కర్ణాటక హైకోర్ట్ సమాజసేవ చేయాల్సిందిగా శిక్ష విధించింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలను ఆరు నెలలపాటు శుభ్రపరచడం సహా తోటపని చేయాలని తీర్పు ఇచ్చింది. అసలేం జరిగిందంటే?

High Court Orders Accused To Do Community Service : కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తల్లిని హత్య చేసిన నిందితుడికి ఆరు నెలలు సమాజ సేవ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం వల్ల తల్లి మరణ వాంగ్మూలాన్ని నమ్మడం కష్టమని ధర్మాసనం తేల్చింది.

తల్లి హత్య కేసులో..
మడికేరికి తాలూకాలోని సంపాజేకు చెందిన నిందితుడు అనిల్‌పై తల్లి గంగమ్మ(60)ను కొట్టి చంపాడన్న అభియోగం ఉంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ట్రయల్ కోర్టు అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన జస్టిస్‌ కేఎస్‌ ముద్గల్‌, జస్టిస్‌ టీజీ శివశంకర్‌ గౌడ్‌తో కూడిన ధర్మాసనం, నిందితుడికి రూ.10,000 జరిమానా విధించింది. నిందితుడు ఇప్పటికే రెండేళ్ల జైలు శిక్షను అనుభవించడం వల్ల ఆరు నెలల పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సేవ చేయాలని తీర్పు ఇచ్చింది.

అసలేం జరిగిదంటే
కేసు వివరాల్లోకి వెళితే, 2015 ఏప్రిల్ 4న ఈ హత్య జరిగింది. సంపాజేకు చెందిన అనిల్ పని లేకుండా బయట తిరుగుళ్లు తిరుగుతూ మద్యానికి అలవాటు పడటం వల్ల తల్లి అతడిని మందలించింది. పని చేసుకుని బతకమని గట్టిగా చెప్పింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అనిల్ కోపోద్రిక్తుడై తల్లిపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యింది. అనంతరం చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో అనిల్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అప్పుడు కొడుగులోని ట్రయల్‌ కోర్టు అనిల్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

మరణ వాంగ్మూలం ఇచ్చినా
అనిల్‌ తల్లి మరణ వాంగ్మూలంలో కూడా తన కుమారుడే తనను తోసేశాడాని చెప్పింది. అయితే ప్రతక్ష సాక్షులు లేకపోవడం వల్ల మార్చి 2017లో కొడగులోని ట్రయల్ కోర్టు అనిల్​ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే దీన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది.

దిల్లీలోని 97 స్కూళ్లకు బాంబు బెదిరింపులు- పోలీసులు అలర్ట్- టెన్షన్ టెన్షన్! - Bomb Threat At Delhi Schools

మీసం, గడ్డం ఫుల్​గా పెంచారని 80మందిని తీసేసిన కంపెనీ- వాళ్లు చెప్పినట్లు చేసినా!! - Beard Moustache Controversy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.