ETV Bharat / bharat

నేవీ, NCB భారీ ఆపరేషన్- 3,300 కిలోల డ్రగ్స్ సీజ్- విలువ రూ.వెయ్యి కోట్లపైనే

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 10:04 AM IST

Updated : Feb 28, 2024, 10:39 AM IST

Coast Guard Drug Bust : అరేబియా సముద్రం గుండా తరలిస్తున్న 3,300 కిలోల డ్రగ్స్​ను భారత నౌకా దళం, ఎన్​సీబీ, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా సీజ్ చేశాయి. ఈ మేరకు అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద భారీ ఆపరేషన్ నిర్వహించాయి.

coast-guard-drug-bust-iranian-boat
coast-guard-drug-bust-iranian-boat

Coast Guard Drug Bust : గుజరాత్‌లో వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోర్‌బందర్‌లో భారత నౌకా దళం, యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంయుక్తంగా భారీ ఆపరేషన్‌ నిర్వహించి 3,300 కిలోల డ్రగ్స్‌ను సీజ్‌ చేశాయి. ఈ డ్రగ్స్‌ను ఇరాన్‌, పాకిస్థాన్‌ల నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నౌకలో 3,300 కిలోల డ్రగ్స్‌ను తరలిస్తుండగా పట్టుకున్నామని, వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వేల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో అయిదుగురిని అరెస్ట్‌ చేశామని, అందులో నలుగురు ఇరాన్ దేశస్థులు ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్‌ విలువ రూ.వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు.

coast-guard-drug-bust-iranian-boat
నేవీ ఆపరేషన్

సీజ్ చేసిన డ్రగ్స్​లో 3089 కేజీలు చరాస్, 158 కేజీలు మెథాంఫెటమైన్, 25 కేజీలు మార్ఫైన్ ఉన్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. స్మగ్లింగ్ విషయాన్ని నిఘా విమానం పీ8ఐ ఎల్ఆర్ఎంఆర్ గుర్తించిందని వెల్లడించింది. వెంటనే అటువైపు తమ నౌకను పంపించినట్లు వివరించింది. పరిమాణం పరంగా ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారని పేర్కొంది. సీజ్ చేసిన డ్రగ్స్, అందులోని సిబ్బందిని తీరానికి చేరిన తర్వాత దర్యాప్తు ఏజెన్సీలకు అప్పజెప్పినట్లు స్పష్టం చేసింది.

coast-guard-drug-bust-iranian-boat
సీజ్ చేసిన డ్రగ్స్​, స్మగ్లర్లతో నేవీ సిబ్బంది
coast-guard-drug-bust-iranian-boat
నేవీ ఆపరేషన్

అమిత్ షా స్పందన
సముద్రంలో భారీ స్థాయిలో డ్రగ్స్ సీజ్ చేసి ఏజెన్సీలు అతిపెద్ద విజయాన్ని నమోదు చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్​ను మాదకద్రవ్యరహిత దేశంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ఏజెన్సీలు పనిచేశాయని చెప్పారు. 'ఎన్​సీబీ, నేవీ, గుజరాత్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి 3123 కేజీల భారీ డ్రగ్ కన్​సైన్​మెంట్​ను సీజ్ చేశారు. దేశాన్ని డ్రగ్-ఫ్రీగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ విజయం అద్దం పడుతుంది. ఈ సందర్భంగా ఎన్​సీబీ, నేవీ, గుజరాత్ పోలీసులకు నేను అభినందనలు తెలియజేస్తున్నా' అని అమిత్ షా ట్వీట్ చేశారు.

ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందాలో సినీ నిర్మాత- రూ.2వేల కోట్ల నెట్​వర్క్ గుట్టురట్టు

రూ.1100 కోట్ల విలువైన డ్రగ్స్​ సీజ్​- గోడౌన్లలో దాచిన 600కిలోలు స్వాధీనం

Last Updated :Feb 28, 2024, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.