తెలంగాణ

telangana

తాలిపేరుకు మళ్లీ భారీ వరద.. 20 గేట్లు ఎత్తిన అధికారులు...

By

Published : Aug 7, 2022, 7:37 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

()
తాళిపేరు జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీవర్షాలతో గోదావరిలో నీటిమట్టం పెరిగింది. ఛత్తీస్​గఢ్​, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో తాళిపేరు జలాశయం నిండుకుండలా మారింది. పరిస్థితిని సమీక్షించిన అధికారులు 20 గేట్లను ఎత్తి 1,28,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరిగినందున ముంపు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Last Updated :Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details