తమిళనాడులో భారీవర్షాలు(Tamil nadu Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేలూరు జిల్లా, గుడియత్తమ్ నగరంలోని నది ఉప్పొంగి రెండంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో ముందుగానే.. అందులోని న్యాయవాది ఎలాంగోవన్ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించటం వల్ల ప్రాణనష్టం తప్పింది.