తెలంగాణ

telangana

కట్టిపడేస్తోన్న 'పాకాల' అందాలు.. మది పరవశించే రమణీయ దృశ్యాలు..

By

Published : Jul 18, 2022, 7:15 PM IST

కట్టిపడేస్తోన్న 'పాకాల' అందాలు.. మది పరవశించే రమణీయ దృశ్యాలు..

నింగిని తాకే గిరుల పైనుంచి జాలువారే జలపాతాలు. సెలయేటి గలగలల మధ్య అతిథులను ఆహ్వానించే పక్షుల కిలకిలరావాలు. చూపు తిప్పుకోనివ్వని హరిత సొబగులతో ప్రకృతి సోయగాన్ని ఒడిలో నింపుకొని.. పర్యాటకుల స్వర్గధామంగా నిలుస్తోంది వరంగల్​ జిల్లాలోని పాకాల సరస్సు. కాకతీయుల పాలనా వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచే ఆ సరస్సు.. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రకృతి ప్రేమికులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతోంది.

కట్టిపడేస్తోన్న 'పాకాల' అందాలు.. మది పరవశించే రమణీయ దృశ్యాలు..

ధర్మబద్ధమైన పాలనతో పాటు.. పాడి పంటలతో ప్రజలు సుభిక్షమే లక్ష్యంగా వ్యవసాయ, నీటి వనరులకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన కాకతీయ రాజులు వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు నిర్మించిన ప్రధాన తటాకాల్లో.. పాకాల చెరువు ప్రధానమైనది. గణపతి దేవుని కాలంలో 1213లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్​నగర్​ శివారులో.. 30 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో చెరువును నిర్మించారు. చారిత్రక సంపదగా అన్నదాతల పెన్నిదిగా నిలిచే పాకాల సరస్సు.. పర్యాటక కేంద్రంగానూ ప్రసిద్ధి చెందింది. నర్సంపేటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సరస్సు చుట్టూ.. 800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి అభయారణ్యం ఉంది.

పాకాల చెరువు మధ్యలో ఉన్న కొండతో పాటు.. ఉద్యానవనం సమీపంలోని పాకాల గుట్ట, సరస్సు అందాలను వీక్షించేందుకు ప్రత్యేక వ్యూ పాయింట్​లు ఉన్నాయి. వానాకాలం వచ్చిందంటే.. ఇక్కడి ప్రకృతి అందాలు సందర్శకులను కట్టిపడేస్తుంటాయి. అభయారణ్యంలో జంతువులు, అరుదైన పక్షుల సందడితో పాటు సరస్సు అందాలు, హరిత సొబగులు.. సందర్శకులకు కనువిందు చేస్తుంటాయి.

పూర్తిస్థాయికి నీటిమట్టం..: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. పాకాల సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. చెరువు నీటి మట్టం 30.2 అడుగులకు గానూ.. పూర్తిస్థాయిలో నిండి మత్తడి దూకుతోంది. దట్టమైన అడవి, కొండ కోనల మధ్య ప్రకృతి అందాలను వీక్షించేందుకు సందర్శకులు తరలివచ్చి.. ప్రకృతి సోయగాలను చూసి పరవశించిపోతున్నారు. 30 ఏళ్ల చరిత్రలో జులైలోనే పాకాల చెరువు జలకళను సంతరించుకోవటం ఇదే మొదటిసారి. చెరువు నిండటంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు... రెండు పంటలకు ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి..

బొగత జలపాత పరవళ్లు.. మది పరవశించే రమణీయ అందాలు..

రాష్ట్రపతి ఎన్నికల్లో 98.90% ఓటింగ్.. దిల్లీకి బ్యాలెట్ బాక్సులు!

ABOUT THE AUTHOR

...view details