గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీ నీటమునిగింది. ఇటీవలే నూతనంగా వెలిసిన ఈ కాలనీలో దాదాపు 300 ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.
వర్షపు నీరు పోయే గొలుసుకట్టు కాలువలను మూసేసి నిబంధనలకు విరుద్ధంగా ఈ కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో 2రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీ జలమయమైంది. రాకపోకలకు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవే, ఉప కమిషనర్ బాలయ్య కాలనీని పరిశీలించారు. వరద నీరు పోయేందుకు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:Revanth reddy on huzurabad bypoll: రెండురోజుల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన