తెలంగాణ

telangana

బండి సంజయ్‌ పాదయాత్రపై ప్రభుత్వం అప్పీల్‌, విచారణ వాయిదా

By

Published : Aug 26, 2022, 4:36 PM IST

Bandi Sanjay Padayatra
Bandi Sanjay Padayatra ()

Bandi Sanjay Padayatra భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రను ఆపేయాలంటూ ప్రభుత్వం హైకోర్టులో వేసిన అప్పీల్‌పై విచారణ వాయిదా పడింది. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Bandi Sanjay Padayatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ ప్రభుత్వం హైకోర్టులో వేసిన అప్పీల్‌పై విచారణ వాయిదా పడింది. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బండి సంజయ్‌ పాదయాత్రను ఆపాలంటూ పోలీసులిచ్చిన నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి గురువారం సస్పెండ్ చేశారు. ప్రజాసంగ్రామ యాత్రకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు.

high court adjourned TS Govt Appeal to Stop Bandi Sanjay Padayatra: ఈ క్రమంలోనే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ దాఖలు చేసింది. అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని కోరింది. పాదయాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం రెండున్నరకు విచారణ చేపట్టిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

గతంలోనే పోలీసుల నోటీసులు..: బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని ఈ నెల 23న పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని.. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతి భద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

జనగామలో పూర్తి, హనుమకొండలోకి ఎంట్రీ..: అయితే పాదయాత్రను అనుమతించాలంటూ హైకోర్టులో భాజపా నేతలు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసును సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. పోలీసుల నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ధర్మస్థానం అనుమతితో బండి సంజయ్​ పాదయాత్రను నేడు తిరిగి ప్రారంభించారు. మొన్న ఆపేసిన ఉప్పుగల్ సమీపంలోని శిబిరం నుంచే యాత్రను తిరిగి ప్రారంభించారు. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా నాగాపురం వరకు సాగిన పాదయాత్ర నేటితో జనగామ జిల్లాలో పూర్తయి.. హనుమకొండ జిల్లా గర్నేపల్లిలోకి ప్రవేశించింది. హనుమకొండ జిల్లా భాజపా శ్రేణులు బండి సంజయ్‌కి ఘనస్వాగతం పలికారు.

ఇవీ చూడండి..

బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్

దమ్ముంటే సభను అడ్డుకోండి, మా సత్తా ఎంటో చూపిస్తామన్న బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details