గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు తమ ఆవాస ప్రజల భాగస్వామ్యం తీసుకొని ఆదర్శంగా నిలిచిన అరవై పాఠశాలల విజయగాథలను ప్రచురించింది. వివిధ ప్రమాణాలను సంతృప్తిపరిచిన పాఠశాలల వివరాలను ‘‘ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ స్కూల్స్ ఇన్టు వైబ్రెంట్ లెర్నింగ్ హబ్’’ పేరిట 278 పేజీల పుస్తకాన్ని ప్రచురించింది. విజయాలను సమర్థించే చిత్రాలను, వివరాలు అందించిన ప్రధానోపాధ్యాయుల వివరాలు కూడా పొందుపరిచారు. ఈ పుస్తకంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు పాఠశాలల వివరాలు చోటు చేసుకున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘వైజ్ఞానిక విజయం’ పేరిట, వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ ప్రాథమిక పాఠశాల Hard work is a key to success, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ సంగం ఉన్నత పాఠశాల we love our school ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘‘కృషితో నాస్తి దుర్భిక్షం’’ శీర్షికన రాసిన కథనాలు అందులో చోటు చేసుకున్నాయి.
నగదు బహుమతులు
కడిపికొండలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. వేలాది రూపాయల ఫీజు చెల్లిస్తూ ప్రైవేటు పాఠశాలకు పంపే నిరుపేద తల్లిదండ్రులను కలిసి, వారిలో అవగాహన పెంచి.. 104 మంది ప్రభుత్వ బడికి వచ్చేలా చేశారు.
అధ్యయన శాల ఏర్పాటు
సంగెం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులకు భాషా అధ్యయనశాలలు ఏర్పాటు చేశారు. ఊరి ప్రజలను చైతన్యవంతులను చేసి రసాయన విగ్రహాలస్థానే విద్యార్థులు మట్టి విగ్రహాలు తయారు చేసి వినాయక చవితిని పర్యావరణహితంగా నిర్వహించుకునేలా చేస్తున్నారు.
మెరుగైన ఫలితాలు