తెలంగాణ

telangana

Panchayat awards 2023: జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెల సత్తా

By

Published : Apr 17, 2023, 5:50 PM IST

Updated : Apr 17, 2023, 7:59 PM IST

National Panchayat awards 2023
National Panchayat awards 2023

National Panchayat awards 2023: జాతీయస్థాయిలో తెలంగాణ పల్లెలు సత్తా చాటాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రామ పంచాయతీల ప్రతినిధులు అవార్డులను అందుకున్నారు. 2023 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 46 అవార్డుల్లో రాష్ట్రానికి 13 దక్కాయి. 8 విభాగాల్లో నాలుగింటిలో ఒక ప్రత్యేక కేటగిరీలో మొదటి ర్యాంకు లభించింది. ముఖ్యమంత్రి పాలనా దక్షతతోనే దేశంలోనే తెలంగాణ పల్లెలు ఆదర్శంగా నిలిచాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు.

జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెల సత్తా

National Panchayat awards 2023: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 2023 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఎంపికైన గ్రామ పంచాయతీలకు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు 46 అవార్డులు ప్రకటించగా.. అందులో తెలంగాణకు ఏకంగా 13 అవార్డులు లభించాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకల్లా అగ్రస్థానంలో మన రాష్ట్రం నిలిచింది.

రాష్ట్రానికి 8 అవార్డులు:దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 27 అవార్డులు ప్రకటిస్తే.. అందులో ఏకంగా 8 అవార్డులు రాష్ట్రానికి దక్కడం విశేషం. మొత్తం 9 కేటగిరీలు ఉండగా అందులో 4 విభాగాల్లో రాష్ట్రానికే మొదటి స్థానం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్, జనగాం జిల్లా నెల్లుట్ల, మహబూబ్‌నగర్ జిల్లా కొంగట్‌పల్లి.. సూర్యాపేట జిల్లా ఐపూర్, జోగులాంబ గద్వాల జిల్లా మాన్‌దొడ్డి, వికారాబాద్ జిల్లా చీమల్‌దర్రి పంచాయతీలు అవార్డులు దక్కించుకున్నాయి.

అలాగే పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్, రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ అవార్డులకు ఎంపికయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా-కే, రంగారెడ్డి జిల్లా కన్హాతో పాటు మరికొన్ని గ్రామాలు అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి చేతుల మీదుగా సర్పంచ్‌లు, కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు. మంత్రి ఎర్రబెల్లితో కలిసి వీరంతా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ములుగు జిల్లాకు నానాజీ దేశముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కారంలో రెండో స్థానంలో నిలిచింది.

ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో: ఇందుకు గానూ జిల్లా ప్రతినిధులు రూ.3 కోట్ల నగదుతో పాటు పురస్కారం అందుకున్నారు. ముఖ్యమంత్రి దిశా నిర్దేశంతో తెలంగాణలో పల్లెలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. కేంద్రంతో సమానంగా అంతే మొత్తంలో నిధులిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

''కేంద్ర అవార్డులకు దేశంలోని 2 లక్షల గ్రామాలు పోటీపడ్డాయి. పోటీపడిన 2 లక్షల గ్రామాల్లో వెయ్యి గ్రామపంచాయతీలు తెలంగాణవే. తెలంగాణలోని 4 గ్రామాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌, నర్సరీ ఉన్నాయి. గతంలో ఒక్క గంగదేవిపల్లికి మాత్రమే అవార్డు వచ్చేది. ఇవాళ ప్రదానం చేసిన 40 అవార్డుల్లో రాష్ట్రానికి 13 వచ్చాయి. రాష్ట్రానికి అవార్డులు రావటంలో మిషన్‌ భగీరథ, పల్లె ప్రగతి కీలకపాత్ర పోషించాయి. మిషన్ భగీరథకు రూ.19,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా కూడా.. కేంద్రం రూపాయి ఇవ్వలేదు. గుజరాత్‌కు ఇచ్చినట్లే తెలంగాణ మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాను.'' - ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి

ఇవీ చదవండి:వాస్తవానికి 48 అవార్డులు తెలంగాణకే దక్కాల్సింది.. కానీ : మంత్రి ఎర్రబెల్లి

Adluri Laxman Interview: 'ధర్మపురి ఓట్ల రీకౌంటింగ్ జరగాల్సిందే'

'గే పెళ్లిళ్లకు చట్టబద్ధత వద్దు'.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్.. విచారణ అప్పుడే

Last Updated :Apr 17, 2023, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details