Telangana National Integration Day 2023:రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని (Telangana National Integration Day) నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జరగనున్న వేడుకల్లో ముఖ్యమంత్రికేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం.. పబ్లిక్ గార్డెన్స్లో జరిగే వేడుకల్లో సీఎం పాల్గొంటారు. జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
CM KCR Inaugurated Palamuru Rangareddy Project : పాలమూరు గడ్డపై కృష్ణమ్మ పరుగులు.. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కేసీఆర్
తెలంగాణ శాసన మండలిలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పాల్గొని ముందుగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీ వద్ద పోచారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలిలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి గుత్తా నివాళులు అర్పించారు. మండలి ప్రాంగణంలో పలువురు ఎమ్మెల్సీలతో కలిసి గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో అందరూ పాల్గొనాలి..: తెలంగాణ రాష్ట్రం భారత సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్ 17ను(KTR on September 17).. జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఇటీవల గుర్తు చేశారు. ఈ రోజును ఘనంగా ఎక్కడికి అక్కడ సంబురంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన గతంలోనే పిలుపునిచ్చారు. ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సంబురాల్లో.. మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.
ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జోడెద్దులుగా తీసుకెళ్తూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఓర్వలేని రాజకీయ పార్టీలు.. ప్రతి అంశాన్నీ రాజకీయం చేసే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు సంబురంగా జరుపుకునే జాతీయ సమైక్యతా దినోత్సవంపై కూడా.. కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.
1948 సెప్టెంబర్ 17న దేశంలో.. తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు అని కేటీఆర్ గుర్తు చేశారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజు అని అన్నారు. ఈ సందర్భం అందరికీ గుర్తు ఉంటుందని చెప్పారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17ను సైతం వక్రీకరించి.. తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.
KCR Speech in Kollapur Public Meeting : 'విశ్వగురు అని చెప్పుకునే మోదీ.. 9 ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చలేదు'
CM KCR Inaugurates 9 Medical Colleges : 'వైద్యవిద్యలో నవశకం.. ఒకేరోజు 9 వైద్య కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామం'