తెలంగాణ

telangana

విశాఖ రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ స్టే

By

Published : May 11, 2022, 12:51 PM IST

National Green Tribunal stays on Rushikonda excavations
విశాఖ రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ స్టే ()

ngt stay on visakha rushikonda excavations: విశాఖ రుషికొండ తవ్వకాలపై ఎన్టీటీ స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వరకు పనులు ఆపేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎంపీ రఘురామ పిటిషన్‌పై ఈనెల 6న ఎన్జీటీ బెంచ్ విచారణ జరిపింది.

ngt stay on visakha rushikonda excavations: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది. ఆ రాష్ట్ర ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 6న ఎన్జీటీ బెంచ్‌ విచారణ జరిపింది. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని ఎన్జీటీ నియమించింది. ఏపీ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: సింహాన్ని తరిమిన శునకం.. నెట్టింట వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details