చిన్నారులు ఎక్కువ మందికి విష జ్వరాలు వస్తున్నాయని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే డెంగీ బారిన పడిన వారి సంఖ్య పెరిగిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సగానికి పైగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని.. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ప్రజలు మోసపోవద్దని డీహెచ్ సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. నిత్యం అరవైమందికి పైగా బాధితులు డెంగీ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో విష జ్వరాల నుంచి కాపాడుకోవటం ఎలా..? ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలేంటి..? అనే అంశాలపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి..
Dengue cases in Telangana: 'ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ప్రజలు మోసపోవద్దు' ఇదీచూడండి:Panna Acid Attack: బాలిక కళ్లల్లో జిల్లేడు పాలు పోసి..