తెలంగాణ

telangana

Bandi Sanjay: కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాలే బాగుపడ్డాయి

By

Published : Jun 2, 2021, 7:13 PM IST

Bandi Sanjay

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాలే లబ్ధి పొందాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలు పూర్తిగా సేకరించామన్నారు.

అమరవీరుల ఆశయ సాధనకు విరుద్ధంగా తెలంగాణలో కేసీఆర్‌ పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాలే లబ్ధి పొందాయని మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి ఆరోపించారు. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలు పూర్తిగా సేకరించామని.. ఇప్పటికే తెరాసకు చెందిన 18మంది ముఖ్యనేతలపై న్యాయపరమైన సలహాలు తీసుకున్నామని అన్నారు.

మాజీమంత్రి ఈటల రాజేందర్... వారం రోజుల్లో భాజపా తీర్థం తీసుకునే అవకాశం ఉందని ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని చెప్పారు. ఎలాంటి హామీ లేకుండానే ఈటల భాజపాలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలతో పాటు ప్రధాని మోదీ పాలన నచ్చి ఈటల భాజపాలో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు భాజపా మంచి వేదిక అని భావిస్తున్నారన్నారు.

ఇదీ చదవండి: DIGITAL SURVEY: జూన్‌ 11 నుంచి పైలట్‌ విధానంలో డిజిటల్‌ భూసర్వే

ABOUT THE AUTHOR

...view details