తెలంగాణ

telangana

జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం రసాభాస

By

Published : Dec 11, 2020, 3:41 PM IST

Zilla Parishad meeting boycott congress bjp in adilabad district
జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం రసాభాస

ఆదిలాబాద్​లో జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం ఉద్రిక్తత నెలకొంది. నిధుల తరలింపుపై కాంగ్రెస్​, తెరాస సభ్యులు వాగ్వాదానికి దిగారు. అధికారపక్షం తీరును నిరసిస్తూ ప్రతిపక్షసభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు.

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రసాభాసగా మారింది. జడ్పీ నిధుల తరలింపుపై కాంగ్రెస్, తెరాస సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి నిధుల మంజూరును కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు.

ఈ గొడవలో సభ్యుడు గణేశ్‌రెడ్డిని జడ్పీ ఛైర్మన్ జనార్దన్‌ రాఠోడ్ సస్పెండ్​ చేశారు. అధికారపక్షం తీరును నిరసిస్తూ కాంగ్రెస్, భాజపా సభ్యులు జడ్పీ సమావేశాన్ని బహిష్కరించారు.

ఇదీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు

ABOUT THE AUTHOR

...view details