తెలంగాణ

telangana

సూపర్​హిట్ 'జై భీమ్​'పై ఇన్ని వివాదాలు ఎందుకు?

By

Published : Nov 15, 2021, 6:03 PM IST

like jai bhim why superhit movies surround by controversy?
సూపర్ హిట్ సినిమాలపై వివాదాలు ఎందుకు?

బ్లాక్​బస్టర్ హిట్స్​గా నిలిచే కొన్ని సినిమాలు వివాదాల సుడి గుండంలో చిక్కుకుంటాయి. అందులో నటించిన నటులకు బెదిరింపులూ వస్తుంటాయి. సినిమా నిర్మించినవారిపై కేసులు పెట్టి రూ.కోట్లు డిమాండ్ చేసిన ఘటనలూ ఉన్నాయి. ఓటీటీలో విడుదలై సూపర్​హిట్​ అయిన జై భీమ్ కూడా ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది(jai bhim controversy). ఇంతకీ ఈ సినిమా ఎందుకు చర్చనీయాంశమైందో చూద్దాం.

సినీ ఇండస్ట్రీలో సూపర్​హిట్​గా నిలిచే సినిమాలు కొన్నిసార్లు వివాదాల్లో నిలుస్తుంటాయి. తమ జాతిని, వర్గాన్ని, ప్రాంతాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని కొందరు కోర్టులను ఆశ్రయిస్తుంటారు. రూ.కోట్లలో పరిహారం డిమాండ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. రామ్​లీలా, పద్మావత్​ వంటి హిందీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొన్ని వర్గాల ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. నటీనటులను చంపుతామని బెదిరింపులూ వచ్చాయి. టాలీవుడ్​లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. అరవింద సమేత సినిమా రిలీజ్ అయినప్పుడు తమ ప్రాంతాన్ని తప్పుగా చూపారని కొందరు నిరసన వ్యక్తం చేశారు.

తాజాగా ఓటీటీలో విడుదలై సూపర్​హిట్​గా నిలవడమే గాక, విమర్శకుల ప్రశంసలు అందుకున్న జై భీమ్​ సినిమాను ఓ వివాదం చుట్టుముట్టింది(jai bhim controversy). ఏ తప్పూ చేయని ఓ బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు కస్టడీలో హత్య చేస్తే, అతని భార్య చేసిన న్యాయపోరాటం ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. 1990ల నాటి వాస్తవ ఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రంలో విలక్షణ నటుడు సూర్య.. చంద్రు అనే లాయర్​ పాత్రలో నటించి మెప్పించారు. ఆయనే నిర్మాతగా వ్యవహరించిన ఈ సందేశాత్మక సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

జై భీమ్​లో సూర్య

అయితే ఈ సినిమాలో సన్నివేశాలు తమ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని తమిళనాడులో వన్నియార్ సంఘం ఆరోపించింది(jai bhim controversy vanniyar). చిత్ర నిర్మాతలు సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్​తో పాటు అమెజాన్ ప్రతినిధికి లీగల్​ నోటీసులు పంపింది. వారం రోజుల్లోగా రూ.5కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.

సినిమాలో బలహీన వర్గానికి చెందిన రాజకన్నును హింసించిన పోలీస్​ అధికారి పాత్రను తమ వర్గానికి చెందిన వ్యక్తిగా చూపారని వన్నియార్ సంఘం అధ్యక్షుడు ఆరోపించారు(jai bhim news ). చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరెకిక్కించామని చెబుతున్నప్పటికీ.. పాత్రల పేర్లు అందుకు భిన్నంగా ఉన్నాయని నోటీస్​లో పేర్కొన్నారు. నిజ జీవితంలో జరిగిన ఘటనలో పోలీస్ అధికారి పేరు ఆంథోనిసామి అని, అతను క్రైస్తవుడు అని వివరించారు. జై భీమ్ సినిమాలో మాత్రం సబ్​ ఇన్​స్పెక్టర్​ పాత్రను వన్నియార్ వర్గానికి చెందిన వ్యక్తిగా చూపించారన్నారు. ఓ సీన్​లో క్యాలెండర్​లో తమ సంఘం గుర్తయిన అగ్ని కుంభాన్ని కూడా ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని తొలగించాలని డిమాండ్ చేశారు.

'సూర్యపై దాడి చేస్తే రూ.లక్ష'

ఈ సినిమాలో విలన్ పాత్ర దివంగత పీఎంకే(పట్టాలి మక్కల్ కట్చి)నేత కాదువెట్టి గురును ప్రతిబింబించేలా ఉందని ఆ పార్టీ మయిలదుథురై జిల్లా కార్యదర్శి పజాని సామి ఆరోపించారు(jai bhim controversy news). వన్నియార్​ వర్గాన్ని నెగెటివ్​ షేడ్​లో చూపించారని, దానివల్ల సమాజంలో తమపై చెడు ముద్ర పడుతుందన్నారు. ఈ చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మయిలదుథురైలో జై భీమ్ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్​ను పీఎంకే కార్యకర్తలు మూసివేశారు. సూర్య పోస్టర్లను చింపివేశారు. ఆ తర్వాత పోలీసులు వెళ్లి సినిమాను ప్రదర్శించాలని చెప్పినా నిర్వాహకులు ఒప్పుకోలేదు. జై భీమ్​ను తీసేసి వేరే సినిమా వేశారు.

అంతేగాక హీరో సూర్య తమ ప్రాంతానికి వస్తే యువత దాడి చేయాలని, అలా చేసిన వ్యక్తికి రూ.లక్ష బహుమానంగా ఇస్తామని పీఎంకే జిల్లా కార్యదర్శి పళని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం మొత్తం స్థానికంగా సంచలనం రేపింది.

జై భీమ్​లో సూర్య

'ఎవరినీ కించ పరిచి ఉద్దేశం లేదు'

ఈ వివాదంపై హీరో సూర్య స్పందించారు(actor suriya news). ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.

"నా తోటి మనుషుల జీవితాలను మెరుగుపరిచేందుకు నా వంతు గట్టి ప్రయత్నం చేస్తున్నాను. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి నాకు మద్దతు ఉంది. ఎవరినీ దూషించి పబ్లిసిటీ పొందాలనే ఉద్దేశం కానీ, అవసరం కానీ నాకు లేదు. ఏ వర్గాన్నీ అవమానించే ఉద్దేశం మా చిత్ర బృందానికి లేదు. కొన్ని ఉదంతాలు ఎత్తిచూపిన వెంటనే సినిమాలో మార్పులు చేశాం. ఏదైనా ఒక వర్గాన్ని కించపరిచేందుకు భావప్రకటనా స్వేచ్ఛను ఉయోగించుకూడదు. ఈ చిత్రం ఒక డాక్యుమెంటరీ కాదు. ఒక వాస్తవ సంఘటన ఆధారంగా కథ కల్పితమని డిస్‌క్లైమర్‌ (disclaimer)తో మొదలవుతుంది. ఇందులోని సన్నివేశాలు కానీ పేర్లు కానీ ప్రత్యేకంగా ఒకరిని లేదా ఏదైనా సంఘటనను ఉద్దేశించి తీసినవి కావు. బలహీనత గురించి నిజంగా పట్టించుకోని వారు.. వారిపై తమ అధికారాన్ని ఉపయోగిస్తారు. ఇందులో కులం, మతం, భాష, జాతి అనే పట్టింపులు ఉండవు ప్రపంచమంతటా దీనిని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయి." అని సూర్య(actor suriya news latest) వివరణ ఇచ్చారు.

జై భీమ్​లో సూర్య

జై భీం సినిమా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్​లో విడుదలైంది. 2డీ ఎంటర్​టైన్​మెంట్​ బ్యానర్​పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు.

ఇదీ చదవండి:'జైభీమ్'​ రికార్డు.. కొత్త రిలీజ్​ డేట్​తో 'గంగూబాయ్​'

ABOUT THE AUTHOR

...view details