తెలంగాణ

telangana

సీనియర్ నటీమణులు ఖుష్బూ, శోభనకు కరోనా

By

Published : Jan 10, 2022, 11:23 PM IST

Khushbu
shobhana

సినీ పరిశ్రమలో కరోనా కలకలం కొనసాగుతోంది. ప్రముఖ సినీయర్ నటీమణులు ఖుష్బూ సుందర్, శోభనకు కొవిడ్ పాజిటివ్​ వచ్చింది.

ప్రముఖ సినీ నటి, రాజకీయవేత్త ఖుష్బూ సుందర్ సోమవారం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో వెల్లడించారు ఖుష్బూ. రెండు వేవ్​లు తప్పించుకున్నా, మూడో వేవ్​లో వైరస్​కు చిక్కినట్లు పేర్కొన్నారు.

శోభనకు ఒమిక్రాన్‌

అంతకుముందు సీనియర్‌ నటి, భరతనాట్య కళాకారిణి శోభన ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తనకు కీళ్ల నొప్పులు, చలిజ్వరం ఉన్నట్టు ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పేర్కొన్నారు. వ్యాక్సిన్లు వేసుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా తనకు ఈ కొత్త వేరియంట్‌ సోకిందని తెలిపారు. అయితే, తాను కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నానని.. ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు.

శోభన

ఇదీ చూడండి:Bandla Ganesh Corona: బండ్ల గణేశ్​కు మూడోసారి కరోనా

ABOUT THE AUTHOR

...view details