అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కాల్పులు స్థానికంగా కలకలం రేపాయి. శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఓక్లాండ్ తిరిగి వస్తున్న ఓ పార్టీ బస్సుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల నుంచి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
మృతులు ఓక్లాండ్కు చెందిన అలాసియా థర్స్టన్ (19), మోడెస్టోకు చెందిన జోయ్ హ్యూస్ (16)గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో మరో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.