తెలంగాణ

telangana

మహేశ్‌-రాజమౌళి సినిమా షూటింగ్​పై విజయేంద్రప్రసాద్‌ క్లారిటీ

By

Published : May 10, 2022, 3:15 PM IST

Updated : May 10, 2022, 11:00 PM IST

Mahesh-Rajamouli

సూపర్​స్టార్​ మహేశ్‌బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న సినిమాపై క్లారిటీ ఇచ్చారు రచయిత విజయేంద్రప్రసాద్‌ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది సినిమా మొదలవుతుందని తెలిపారు.

మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన 'సర్కారువారి పాట' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్‌ నుంచి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందే చిత్ర షూటింగ్‌లో మహేశ్‌బాబు పాల్గొంటారని ఇటీవల తెలిపారు. ఈ క్రమంలో అగ్ర దర్శకుడు రాజమౌళితో సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనికి ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ సమాధానం ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మహేశ్‌-రాజమౌళి సినిమా మొదలవుతుందని తెలిపారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.

'ప్రస్తుతం కథను సిద్ధం చేస్తున్నాం. స్క్రిప్ట్‌ ఇంకా పూర్తి కాలేదు. అడవి నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ ఏడాది మహేశ్‌బాబు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తున్న మూవీతో బిజీగా ఉంటారు. అందుకే రాజమౌళితో సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మొదలవుతుంది' అని విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవల దీనిపై మహేశ్‌బాబు మాట్లాడుతూ.. రాజమౌళితో కలిసి పనిచేయటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని అన్నారు. కచ్చితంగా అద్భుతమైన ప్రాజెక్టు అంటూ వివరించారు. ఇండియానా జోన్స్‌ మూవీస్‌లా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి:41 ఏళ్ల వయసులో హీరోయిన్ ప్రెగ్నెంట్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!

Last Updated :May 10, 2022, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details