తెలంగాణ

telangana

'నా పిల్లల కన్నా మోదీనే ఇష్టం'.. స్టార్ నటుడి తల్లి పోస్ట్.. కంగన రియాక్షన్ ఇదే!

By

Published : Sep 18, 2022, 10:47 PM IST

Etv kangana ranaut

కంగనా రనౌత్.. ఈ పేరు చాలా మందికి సుపరిచితమే ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బాలీవుడ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగానే ఉంటుంది. తెలుగులో 'ఏక్​ నిరంజన్​' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే తాజాగా ఓ ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​కు స్పందించింది. అది ఏంటంటే..

అన్ని సందర్భాలు ఆమెవే. ఎవ్వరినైనా ప్రశ్నిస్తుంది. నిరంతరం వార్తల్లో మెదులుతూనే ఉంటుంది. అటు సినిమాల్లో.. ఇటు సోషల్​ మీడియాలో బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె ఎవరో కాదు అందురికీ సుపరిచితురాలు.. బాలీవుడ్ భామ.. కంగనా రనౌత్​. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె ఇన్​స్టాలో ఓ పోస్టుకు చేసిన కామెంట్​ వైరల్​గా మారింది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్​ ఖేర్​ ఇన్​స్టాగ్రామ్​లో వీడియో పోస్ట్​ చేశారు. అందులో అతడి తల్లి దుల్హరి.. పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన శుభాకంక్షలు తెలిపారు. తన సొంత కుమారుల కంటే.. తనకు నరేంద్ర మోదీ అంటే ఇష్టమని చెప్పారు. ఈ సంభాషణ అంతా అనుపమ్​ ఖేర్​ తమ్ముడు రాజు ఖేర్​ వీడియో తీశారు. తర్వాత అనుపమ్​ ఖేర్​ దాన్ని పోస్ట్​ చేస్తూ..

"మోదీజీకి పుట్టిన రోజు సందర్భంగా మా అమ్మ శుభాకాంక్షలు తెలిపింది. దీన్ని నా తమ్ముడు రాజు ఖేర్​ వీడియో తీశాడు. ఈ వీడియోలో.. మోదీ వేల మంది తల్లుల ఆశీస్సులు పొందారు అని మా అమ్మ దుల్హరీ చెప్పింది. మా అమ్మ మా కంటే మోదీనే ఎక్కువ ఇష్టపడుతుంది. ఆమె మోదీజీకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియాజేశారు. మోదీజీకి లక్షల మంది తల్లుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి" అని చెప్పుకొచ్చారు. దీనికి మోదీజీ రాక్స్​.. దుల్హరీ రాక్స్​ అనే హ్యాష్​ ట్యాగ్ జత చేశారు.

ఈ పోస్టుకు కంగనా రౌనౌత్ రియాక్ట్​ అయ్యారు. అనుపమ్​ ఖేర్ తల్లిని ఉద్దేశిస్తూ.. "ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ అలాగే ఉండాలి. ఆమెకు దేవుడు సంపూర్ణ ఆయుష్షు ఇవ్వాలి" అని కామెంట్​ చేశారు. దీని కంటే ముందు మోదీతో దిగిన ఫొటోను ఇన్​స్టా స్టోరీలో షేర్ చేస్తూ.."గౌరవనీయులైన మోదీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. టీలు అమ్మే బాలుడి స్థాయి నుంచి ఈ భూగ్రహం మీద అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. మీది చాలా అద్భుతమైన ప్రయాణం. మీకు ఆయుష్షు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీరు ఒక రాముడు, కృష్ణుడు, గాంధీ లాగా శాశ్వత కీర్తిని పొందారు. ఈ దేశంలో, ప్రపంచంలో మీరు చరిత్ర లిఖించారు. మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. మీ కీర్తి ఎవరూ చెరపలేరు. అందుకే మిమ్మల్ని నేను 'అవతార్​' పిలుస్తాను. మీరు మాకు నాయకుడిగా ఉండటం మా అదృష్టం" అంటూ రాసుకొచ్చింది. అయితే అనుపమ్ ఖేర్​, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్​.. లోక్ నాయక్​​ జయప్రకాశ్​ నారాయణ్​​గా, కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తున్నారు.

ఇవీ చదవండి:అలయా.. మాళవిక.. సోనాలి..​ ఇంత అందం మీకెక్కడిదమ్మా?

రష్మికకు మరో బంపర్​ ఆఫర్​.. బాలీవుడ్​లోనూ తగ్గేదేలే!

ABOUT THE AUTHOR

...view details