తెలంగాణ

telangana

TRIPLE MURDER: వ్యవసాయ భూమిలో త్రిపుల్ మర్డర్

By

Published : Jun 19, 2021, 3:07 PM IST

Updated : Jun 19, 2021, 8:48 PM IST

భూ తగాదాలతో ముగ్గురిని చంపిన ప్రత్యర్థులు

15:05 June 19

భూ తగాదాలతో ముగ్గురిని చంపిన ప్రత్యర్థులు

వ్యవసాయ భూమిలో త్రిపుల్ మర్డర్

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని గంగారంలో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ముల కుటుంబాల మధ్య చెలరేగిన భూవివాదం.. ముగ్గురిని కడతేర్చింది. తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అతి దారుణంగా నరికి చంపారు. పొలం హద్దుల విషయంలో గత కొంత కాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. దీనికి సంబంధించి మరోసారి మాట్లాడుకునేందుకు పొలం వద్ద... రెండు కుటుంబాలు సమావేశమయ్యారు. మాటామాటా పెరిగి గొడవ తారాస్థాయికి చేరడంతో.. మంజూ నాయక్, ఆయన కుమారులు సారయ్య, భాస్కర్‌ల కళ్లల్లో కారం చల్లి.. ప్రత్యర్థులు గొడ్డలితో దాడి చేశారు. వారు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

మంజూనాయక్‌ మరో కుమారుడు గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఘటనా స్ధలంలో మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

18 ఎకరాల పొలానికి సంబంధించి మంజూనాయక్.. అతని తమ్ముని కుటుంబాల మధ్య చాలా రోజుల నుంచి భూవివాదం నడుస్తోంది. పలుమార్లు ఘర్షణపడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఇదే విషయంలో వీరి కుటుంబాల మధ్య జరిగిన గొడవ.. ఈ మూడు హత్యలకు దారితీసింది. విషయం తెలుసుకున్న కాటారం పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.

భూ తగాదాలతో జరిగిన 3 హత్యలతో గంగారం పరిసర ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. 

ఇదీ చూడండి: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

Last Updated :Jun 19, 2021, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details