తెలంగాణ

telangana

రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు మృతి

By

Published : Jan 23, 2023, 11:09 AM IST

Road Accident : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్​పై వెళ్తున్న తల్లి ,కుమారుడిని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కుమారుడు అక్కడిక్కడే మృతి చెందగా.. తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Road Accident
Road Accident

Road Accident : ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​పై వెళ్తున్న తల్లి, కుమారుడిని ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వీరిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు. తల్లి కుమారుల మరణంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం కె. సావరం గ్రామానికి చెందిన నార్ని పవన సూర్య గణేష్(22), అతని తల్లి వెంకట సత్యవతి(51) పనిమీద ముప్పవరనికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.

ఈ క్రమంలో వారు నిడదవోలు మండలం కలవచర్ల వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న కారు.. వీరి ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే నార్ని పవన సూర్య గణేష్ ప్రాణాలు కోల్పొయాడు. చికిత్స అందిస్తుండగా వెంకట సత్యవతి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహలను శవ పంచనామా కోసం.. మార్చురీకి తరలించారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details