తెలంగాణ

telangana

Dead body in Water tank: హైదరాబాద్​లో కలకలం.. వాటర్​ ట్యాంకులో మృతదేహం

By

Published : Dec 7, 2021, 9:05 PM IST

Updated : Dec 7, 2021, 10:35 PM IST

Dead body in Water tank
Dead body in Water tank ()

Dead body in Water tank: హైదరాబాద్‌ ముషీరాబాద్‌ పరిధిలోని వాటర్‌ ట్యాంకులో మృతదేహం లభ్యమైంది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నీటి నుంచి దుర్వాసన వస్తోందని.. అప్పడప్పుడూ వెంట్రుకలు, చిన్న చిన్న మాంసం ముద్దలు వచ్చేవని స్థానికులు చెబుతున్నారు.

Dead body in Water tank: హైదరాబాద్​లో కలకలం.. వాటర్​ ట్యాంకులో మృతదేహం

Dead body in Water tank: హైదరాబాద్‌ ముషీరాబాద్‌ పరిధిలోని రాంనగర్‌ రిసాగడ్డలోని వాటర్‌ ట్యాంకులో మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ట్యాంకు శుభ్రపరచడానికి వెళ్లిన జలమండలి సిబ్బంది కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. క్లూస్​టీం, డీఆర్​ఎఫ్​ బృందాలతో ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీయించారు. వ్యక్తి మృతి, ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం దొరికిన ట్యాంక్​లోని నీటినే వారం రోజులుగా స్థానికులు తాగుతున్నట్లు తెలుస్తోంది. 25 ఏళ్ల యువకుడి మృతదేహంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ట్యాంక్​ నీరు నాలుగు బస్తీలకు వెళ్తుందని స్థానిక కార్పొరేటర్​ తెలిపారు. శివస్థాన్​పూర్​, హరినగర్​, పద్మశాలి కాలనీ సహా మరో బస్తీకి ఈ నీరు వెళ్తుందని చెప్పారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ వారంలో ఓ ఇంట్లో.. నీట్లో నుంచి వెంట్రుకలు, మాంసం ముద్దలు వస్తున్నాయని ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయినా అందుకు కారణం గుర్తించలేకపోయారని స్థానికులు తెలిపారు.

ట్యాంక్​ చాలా పాతకాలం నాటిదని.. శిథిలావస్థకు చేరుకుందన్నారు. సుమారు 50 శాతం నీరు లీకేజీ అవుతుంటుందని చెప్పారు. అప్పుడప్పుడూ పెచ్చులూడిపడుతూ ఉంటుందని.. గతంలో జీహెచ్​ఎంసీ కమిషనర్​గా ఉన్న దానకిషోర్​, ఎమ్మెల్యే ముఠాగోపాల్​ దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. గత కొద్ది రోజులుగా నీటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు తెలిపారు. చిన్నారులకు ఇదే నీటిని తాగించామని.. వేడి చేసుకొని తాగినా దుర్వాసన వచ్చేదని చెప్పారు.

మరో వైపు నీటి ట్యాంకులో బయటపడిన మృతదేహం ఎవరిది.. ఎందుకు ట్యాంకుపైకి వెళ్లాల్సి వచ్చింది.. హత్యచేసి పడేశారా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. ప్రమాదవశాత్తు జరిగిందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి:woman bathing secretary record : స్నానాల గదిలో ఉన్న మహిళ వీడియో తీసిన టెక్నీషియన్‌

Last Updated :Dec 7, 2021, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details