ఆ కళాశాలకు చెందిన విద్యార్థులు విద్యా వైజ్ఞానిక సదస్సు కోసం వివిధ రకాల పరికరాలు, నమునాలు తయారు చేసుకున్నారు. ఈ రోజు భారీ ఎత్తున్న ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే వారికి ఊహించని షాక్ తగిలింది. కొందరు ఆకతాయిలు నిన్న రాత్రి వారు భద్రపరచుకున్న నమునాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే కళాశాలకు చెందిన సామగ్రి దగ్ధమైంది. దీంతో విద్యార్థులు ఎంతో కష్టపడి తయారు చేసిన వివిధ వస్తువులు.. అగ్నికి ఆహుతవ్వడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగిదంటే:జగిత్యాల జిల్లాలో మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా, వైజ్ఞానిక సదస్సు నిర్వహించాలని అనుకున్నారు. ఇందుకనుగుణంగా విద్యార్థులు ఆవిష్కరణలు, పరికరాలు రూపొందించారు. గత ఇరవై రోజుల నుంచి ఈ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది. వివిధ రకాల నమునాలను రెండు గదులలో భద్రపరిచారు. ఈ క్రమంలోనే ఈరోజు భారీ ఎత్తున విద్యా వైజ్ఞానిక సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ క్రమంలోనే వారికి ఊహించని షాక్ తగిలింది