తెలంగాణ

telangana

నమ్మకంగా ఉన్నారు.. అదును చూసి దోచేశారు..

By

Published : Nov 22, 2022, 8:56 PM IST

Gold theft in Hyderguda
Gold theft in Hyderguda ()

Gold theft in Hyderguda: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు అంటారు. అది ఒక్కప్పటి మాట. ఇప్పుడు అలా కాదు మనకున్న టెక్నాలజీకి.. మన పోలీసు వ్యవస్థకు చిన్న క్లూ దొరికిన ఇట్టే పసిగట్టేస్తారు. ఆశ్రయం ఇచ్చి.. పని కల్పించిన యజమాని ఇంట్లోనే దొంగలుగా మారారు పనిమనుషులు. 81 తులాలు బంగారాన్ని దొంగిలించి స్వస్థలం కర్ణాటక ఉడాయించారు. మరి ఎక్కడికి వెళ్లినా ఊరుకుంటారా మన పోలీసులు.. 24 గంటల్లోనే వారిని గుర్తించి.. బంగారాన్ని స్వాధీనం చేసుకొని శభాస్​ అనిపించుకున్నారు.

Gold theft in Hyderguda: హైదరాబాద్​లోని హైదర్​గూడలో జరిగిన బంగారం దొంగతనం కేసును 24 గంటల్లో నారాయణ గూడ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇంటిలో పనిచేసే పనిమనుషులే దొంగలుగా పోలీసులు తేల్చారు. మధ్యమండలం డీసీపీ సునీతారెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం హైదర్​గూడ ఓల్డ్ ఎమ్మెల్యేల వసతి గృహం ప్రాంతంలో ఈవెంట్ ఆర్గనైజర్​గా పనిచేస్తోన్న వరుణ్ జోషి ఇంట్లో సుమారు 81 తులాల బంగారం అపహరణకు గురైంది. బంగారాన్ని బిస్కెట్ల రూపంలో మలిచి స్టీల్ బాక్స్​లో పెట్టిన వరుణ్​ జోషి.. ఇంట్లో ఎంత వెతికిన ఆ బాక్స్​ దొరకకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులపై ఆరా తీశారు.

పని మనుషులే దొంగలుగా అవతారం: ఇంతలో ఇంటిలో పనిచేస్తున్న పనిమనుషులు రాకపోవడం గమనించారు. వారిపై నిఘా పెట్టిన పోలీసులు వారి స్వస్థలం కర్ణాటక వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. దొంగతనం తామే చేసినట్లు పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. నిందితులు గత పది సంవత్సరాలుగా తమ ఇంట్లో పనిచేస్తున్నారని వరుణ్​ జోషి తెలిపారు.

Gold theft in Hyderguda

నిందితులు సునీత, సురేష్, శోభ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి సుమారు 81 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 36 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఈ ఆపరేషన్​లో చాకచౌక్యంగా వ్యహరించిన పోలీసులను ఆమె అభినందించారు.

"నిందితులు గత పది సంవత్సరాలుగా వరుణ్​ జోషి ఇంట్లో పనిచేస్తున్నారు. అందులో సునీతా అలియాస్​ రాధ ఈ నెల 19వ తేదీన తన భర్త సురేష్​తో కలిసి ఇంట్లో ఉన్న స్టీల్​ బాక్స్​ దొంగలించి తన భర్తకు ఇచ్చింది. దీనికి శోభ అనే మరో మహిళ సహకరించింది. వారు వెంటనే దానిని తీసుకొని కర్ణాటక వెళ్లిపోయారు. ఆ తరువాత బాధితుడు ఫిర్యాదుతో మేము వారిని పట్టుకొని మొత్తం బంగారం స్వాధీనం చేసుకున్నాం."- సునీతారెడ్డి, సెంట్రల్​ జోన్​ డీసీపీ

దొంగలుగా మారిన పని మనుషులు.. 81 తులాల బంగారంతో జంప్​..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details