తెలంగాణ

telangana

CM TOUR: 'వైఎస్సార్‌ మత్య్సకార భరోసా' నిధుల విడుదల

By

Published : May 13, 2022, 11:57 AM IST

CM TOUR: 'వైఎస్సార్‌ మత్య్సకార భరోసా' నిధుల విడుదల

CM TOUR: ఏపీలోని కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మురమళ్లలో వైఎస్సార్‌ మత్య్సకార భరోసా నిధులను సీఎం విడుదల చేశారు.

CM TOUR: ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డి​ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో "వైఎస్సార్‌ మత్య్సకార భరోసా" నిధులను విడుదల చేశారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 10.20 గంటలకు ఐ.పోలవరం మండలం కొమరగిరి చేరుకున్న జగన్.. 10.45 గంటలకు మురమళ్ల వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం తర్వాత.. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు తాడేపల్లికి తిరిగి బయల్దేరనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో.. మురమళ్లలో ఏర్పాట్లను ముమ్మడివరం ఎమ్మెల్యే వెంకట సతీశ్ పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details