Fake Fertilisers case: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసరాల్లో ఇటీవల కలకలం రేపిన కల్తీ పొటాష్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఇసుక రంగుమార్చి పొటాష్గా విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇవాళ ఏపీకి వెళ్లిన తెలంగాణ పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విజయవాడ శివారు నున్నలోని హేమ బయోటెక్, ఇతర ఆగ్రో పరిశ్రమలను పరిశీలించారు. పరిశ్రమ నిర్వాహకుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు.