తెలంగాణ

telangana

పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..

By

Published : Jun 23, 2022, 10:52 AM IST

gold price today
gold price today ()

Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,500గా ఉంది. కిలో వెండి ధర రూ.62,050గా ఉంది.

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గురువారం బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,500 వద్ద ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.30 పెరిగి రూ.62,050 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,500గా ఉంది. కిలో వెండి ధర రూ.62,050వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,500గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,050గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,050 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,050 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర పెరిగింది. ప్రస్తుతం 1832 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.32 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ పెరిగింది. ప్రస్తుతం రూ.16,91,924 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.16,91,924
ఇథీరియం రూ. 90,370
టెథర్ రూ.83.30
బినాన్స్​ కాయిన్ రూ.18,333
యూఎస్​డీ కాయిన్ రూ.83.80

Stock Market LIVE Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ దాదాపు 500 పాయింట్ల లాభంతో 52 వేల 300 ఎగువన కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిప్టీ 150 పాయింట్లకుపైగా పెరిగి.. 15 వేల 560 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. హీరో మోటోకార్ప్​, ఐచర్​ మోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ రాణిస్తున్నాయి. అపోలో హాస్పిటల్​, టైటాన్​ కంపెనీ, ఓఎన్​జీసీ, రిలయన్స్​ నష్టపోయాయి.
ఐటీ, ఆటో రంగాల షేర్ల దూకుడుతో మార్కెట్లు లాభాల దిశగా కొనసాగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఐరోపా మార్కెట్లు బుధవారం నష్టాలను నమోదుచేయడం గమనార్హం. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు కూడా గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 710, నిఫ్టీ 226 పాయింట్లను కోల్పోయాయి

ఇవీ చదవండి:'బ్యాంకింగ్​ రంగంలో ఇదే అతిపెద్ద స్కామ్'.. డీహెచ్​ఎఫ్​ఎల్​లో​ రూ.34,615 కోట్ల అవినీతి

ట్విట్టర్ 'డీల్'​కు బోర్డు ఆమోదం.. 3 శాతం పెరిగిన షేర్ల విలువ

ABOUT THE AUTHOR

...view details