రాజస్థాన్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు పెద్దఎత్తున నిరసనలు దిగారు. 'మహాపదవ్' పేరిట చేస్తున్న ఈ ఆందోళనలు గత 32రోజులుగా కొనసాగుతున్నాయి. ఆదివారం అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న నిరుద్యోగ(unemployment in rajasthan) యువతీయువకులు.. రోడ్డుపై పడుకుని చేతులు జోడించి తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఎం అశోక్ గహ్లోత్కు(ashok gehlot today news) విన్నవించారు.
మరోవైపు.. తాము డిమాండ్ చేస్తున్న 21 అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని నిరుద్యోగులు(unemployment rate in rajasthan) తెలిపారు. దీనితో తమ నిరసనలను ఉత్తర్ప్రదేశ్కు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపేన్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు 50 మంది సభ్యుల బృందం జైపుర్ నుంచి యూపీకి బయలుదేరి వెళ్లినట్లు వివరించారు.