RDX Recovered in Gurdaspur: ఎన్నికల వేళ పంజాబ్లో ఆర్డీఎక్స్ కలకలం రేపింది. గురుదాస్పుర్ జిల్లాలోని ఖరాల్ గ్రామంలో 2.5 కిలోల ఆర్డీఎక్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటితో పాటు డిటోనేటర్, ఏకే-47 రైఫిళ్లు లభ్యమయ్యాయి. ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ (ఐఎస్వైఎఫ్) ఆధ్వర్యంలో పాకిస్థాన్ నుంచి వీటిని భారత్కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐఈడీలను తయారుచేసేందుకే ఈ పేలుడు పదార్థాలను సేకరించినట్లు పేర్కొన్నారు.
పాక్లో నివసిస్తున్న ఐఎస్వైఎఫ్ చీఫ్ లఖ్బీర్ సింగ్ రోడే.. ఖరాల్ గ్రామంలోని సుఖ్ప్రీత్ సింగ్ అలియాస్ సుఖ్కు ఈ పేలుడు పదార్థాలను అందిస్తున్నట్లు తెలిపారు.