Army Cheetah helicopter crash :అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడ్డ ఇద్దరు పైలట్లను సమీపంలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. అందులో లెఫ్టినెంట్ కర్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాారు. మరో పైలట్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. డైరెక్టర్ ఫ్యామిలీలో ముగ్గురు సజీవదహనం!
Last Updated :Oct 5, 2022, 2:42 PM IST