తెలంగాణ

telangana

కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. ముగ్గురు మృతి.. చిక్కుకున్న 20 మంది!

By

Published : Jan 24, 2023, 8:05 PM IST

Updated : Jan 24, 2023, 10:28 PM IST

building-collapses-in-lucknow-several-feared-trapped

లఖ్‌నవూలోని ఇజ్రత్‌ గంజ్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ముగ్గురు మృతిచెందారు. 15 నుంచి 20 మంది ఇంకా శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఘోర ప్రమాదం జరిగింది. ఇజ్రత్‌ గంజ్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల అపార్ట్​మెంట్​ భవనం కుప్పకూలిపోయింది. ముగ్గరు మృతి చెందారు. దాదాపు 15 నుంచి 20 మంది శిథిలాల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ అపార్ట్​మెంట్​లో 7 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాలకు సంబంధించిన 15 నుంచి 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటివరుకు 8 మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే, ఆ అపార్ట్​మెంట్​ బేస్​మెంట్​లో కొన్ని రోజులుగా పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఉత్తరాదిలో మంగళవారం భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ నేపథ్యంలోనే భవనం కూలిపోయినట్లు సమాచారం.

లఖ్​నవూలో కుప్పకూలిన భవనం

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవనం కుప్పకూలినట్లు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్‌ పతక్‌ ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే అర్బన్​ డెవెలప్​మెంట్ అధికారి ఏకే మిశ్ర, అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు.

లఖ్​నవూలో కుప్పకూలిన భవనం
లఖ్​నవూలో కుప్పకూలిన భవనం
Last Updated :Jan 24, 2023, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details