ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్యోగంలోకి తీసుకోవటం లేదని సచివాలయ ఉద్యోగి నిరసన - ఆరు నెలలుగా తండ్రీకూతుళ్ల నిరీక్షణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 5:12 PM IST

Village_Agriculture_Assistant_Worry_About_her_Job_in_Prakasam_District

Village Agriculture Assistant Worry About her Job in Prakasam District : ప్రకాశం జి‌ల్లా కనిగిరి మండలం గోసులవీడు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ వ్యవసాయ అసిస్టెంట్‌ వనిత.. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. అనారోగ్య కారణంగా నెలపాటు ఆసుపత్రిలో చేరి.. అనంతరం విధుల్లో చేరేందుకు సంబంధిత మెడికల్ సర్టిఫికేట్స్‌తో సచివాలయం దగ్గరకు వెళ్లగా.. ఎంపీడీవో కార్యాలయం నుంచి జాయినింగ్‌ లెటర్‌ తీసుకురావాలని సెక్రెటరీ కోరారు. అయితే గత ఆరు నెలలు నుంచి తనను, తన తండ్రిని ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిప్పకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తిరిగి అలసిపోయామని వేరే గత్యంతరం లేకనే ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగానని తెలిపారు. 

ఇప్పటికైనా అధికారులు స్పందించి తనను విధుల్లోకి తీసుకోవాలని బాధితురాలు వేడుకుంటుంది. తన లాంటి అనేకమంది సచివాలయ ఉద్యోగులు పలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపింది. వనిత తండ్రి ఏసు మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా ఎంపీడీవో కార్యాలయం, సచివాలయం, అగ్రికల్చర్ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయానని తెలిపారు. వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్​కి ఫిర్యాదు అందించి కలెక్టరేట్ వద్దే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details